"పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు"|

0
150

హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్  హైదరాబాద్ లో  నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జూన్ 2న ఈ సభను నిర్వహించేందుకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేపట్టగా, భద్రతా కారణాలను చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో జరగనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మొత్తం ఆ వేడుకల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

అదే రోజు పెద్ద ఎత్తున రాజకీయ సభ నిర్వహిస్తే ట్రాఫిక్ రద్దీతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అభిప్రాయపడిన అధికారులు సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన నాయకత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. సభ నిర్వహణకు అనుమతి కల్పించాలని కోరుతూ పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణలో పార్టీ విస్తరణ లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నామని జనసేన వర్గాలు చెబుతుండగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
  Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
By Pagadala Venkateswar 2026-01-26 06:55:46 0 140
Telangana
కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా...
By Ponnala Srinivasrao 2026-03-01 06:29:46 0 601
Telangana
భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్?
కరీంనగర్ జిల్లా  *భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...* కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం...
By Thalakokkula Sadanandam 2026-03-21 07:45:53 1 583
Telangana
ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది....
By Ponnala Srinivasrao 2026-05-02 02:54:42 0 91
Prop News
The Green Premium Takes Over Commercial Office Spaces
The mandate for sustainable commercial real estate has officially reached a tipping point. As of...
By Dunna Jessicaruth 2026-05-20 10:52:39 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com