అంబరాన్నంటిన రెండో రోజు 'రేలా' సంబురాలు.. గిరిజన కళా ప్రదర్శనలు అద్భుతం: కలెక్టర్ దినేష్ కుమార్!

0
192

ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 'రేలా' గిరిజన ఉత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా సాగాయి. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారి పర్యవేక్షణలో అధికారికంగా ప్రారంభమైన ఈ వేడుకలు, అడవితల్లి ఒడిలో గిరిజన సంస్కృతి వైభవానికి అద్దం పట్టాయి.సాధారణంగా ఇలాంటి భారీ గిరిజన కళా ఉత్సవాలు ఈశాన్య భారతదేశంలో (North-East States) ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే, మన ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా లో ఇంత భారీ ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అరుదైన వేడుకల్లో పాల్గొనేందుకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుండి భారీగా గిరిజన తెగలు తరలివచ్చాయి.రెండో రోజు వేడుకల్లో భాగంగా గిరిజనులు తమ సంప్రదాయ పండుగలు, గిరిజన వివాహ వేడుకలు, మరియు పురాతన నృత్య రీతులను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. నెమలి పించాల అలంకరణలు, సాంప్రదాయ వాయిద్యాల మోతలతో రంపచోడవరం ప్రాంతం మారుమోగిపోయింది. అంతరించిపోతున్న తమ కళా సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వేదికపై నాలుగు రాష్ట్రాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Uttar Pradesh
UP Expands Women's Empowerment and Social Welfare
Uttar Pradesh continues to expand women's empowerment and social welfare initiatives through...
By Fathima Safa 2026-06-27 05:17:44 0 69
Andhra Pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047...
By Benguluri Madhubabu 2026-02-09 08:00:49 0 277
Andhra Pradesh
పుంగనూరు: వైసిపి స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా హేమచంద్ర
వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శుక్రవారం చిత్తూరు జిల్లా, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-21 08:31:43 0 147
Andhra Pradesh
SIR వర్క్ షాప్ కార్యక్రమంలో
ఎమ్మిగనూరులోని అజంత ఫంక్షన్లో నిర్వహించినElection commission of India special intensive revision...
By Boya Dasthagiri 2026-06-12 16:21:14 0 207
Andhra Pradesh
ఒంగోలు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు
ఒంగోలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు...
By Chennaiah Kati 2026-06-22 06:14:53 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com