సింగరేణి గుర్తింపు సంఘం AITUC తో చర్చలు జరిపిన సింగరేణి డైరెక్టర్ (పా) : గౌతమ్ పొట్రూ

0
112

తేదీ 12/05/2026 :హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) నాయకులతో డైరెక్టర్ (పర్సనల్) శ్రీ గౌతమ్ పొట్రు , ఐఏఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారంపై యాజమాన్యం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సమావేశంలో గుర్తింపు సంఘం ప్రధాన నాయకులు కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించి ఈ క్రింది హామీలు ఇచ్చింది,మెడికల్ బోర్డును ఒక నెలలోపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.సొంత ఇంటి పథకంపై వచ్చే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి అమలు విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.పెర్క్స్ పై ట్యాక్స్ సమస్యను వచ్చే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి అమలు చేస్తామని పేర్కొన్నారు.కార్మికులు క్వార్టర్లు ఖాళీ చేసిన వెంటనే క్వార్టర్ వెకేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తామని తెలిపారు.పెండింగ్‌లో ఉన్న 337 మందికి పైగా డిపెండెంట్‌లకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.గనులపై డిపెండెంట్ ఉద్యోగాల దరఖాస్తులను కేసు వారీగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లిన కార్మికుల వైద్య బిల్లులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.మూడు సంవత్సరాల నిబంధనకు సంబంధం లేకుండా ఖాళీలు ఉన్నచోట వెంటనే ట్రాన్స్‌ఫర్లు చేస్తామని తెలిపారు.మారుపేర్ల సమస్య ప్రభుత్వ స్థాయిలో చర్చించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.అండర్‌గ్రౌండ్ అలవెన్స్ కట్టింగ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.డిస్మిస్ అయిన ఇతర కార్మికుల సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.ఆసుపత్రుల్లో ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.ఓవర్‌మన్‌లకు పెండింగ్ ప్రమోషన్లు మంజూరు చేస్తామని తెలిపారు.అన్‌ఫిట్ అయిన మైనింగ్ మరియు ట్రేడ్స్‌మెన్ కార్మికులకు తగిన సూటబుల్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.రిటైర్డ్ కార్మికులకు నిలిపివేసిన లాభాల వాటా, దీపావళి బోనస్ PLR చెల్లించేందుకు అంగీకరించారు.గోల్డెన్ హ్యాండ్‌షేక్ లేదా VRS లాంటివి అమలు చేయబోమని డైరెక్టర్ స్పష్టం చేశారు.కాంట్రాక్టు కార్మికులు జనరల్ సమ్మెలో పాల్గొన్న వాళ్లకి పీనల్ వెజ్ కట్టింగ్ నిలిపివేస్తామన్నారు అదనంగా, మిగిలిన కీలక సమస్యలను త్వరలో సీఎండీ మరియు డైరెక్టర్ (పర్సనల్) స్థాయిలో జరిగే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం గుర్తింపు సంఘం AITUC నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు.ఈ డైరెక్టర్ పా తో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరీమి రాజ్ కుమార్ , అడిషనల్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య, పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం లో మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-10 13:31:55 0 130
Andhra Pradesh
మదనపల్లి లో పడిపోయిన టమాట ధరలు
మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.220కి పడిపోయింది. మార్కెట్‌కు మంగళవారం...
By Pagadala Venkateswar 2026-01-20 11:00:35 0 141
Andhra Pradesh
మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర...
By Pagadala Venkateswar 2026-02-16 11:01:53 0 215
Telangana
స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి...
By Sidhu Maroju 2025-11-19 07:37:40 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com