"తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|

0
195

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది. 

190 తుర్కపల్లి మరియు 191 మచ్చబొల్లారం డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ నాయకుల నివాసంలో ఘనంగా నిర్వహించబడింది. 

ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సమావేశంలో భాగంగా 191 డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి ని అధికారికంగా యెన్నునుకున్నారు.

ఇక అదే విధంగా శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సర్వేష్ యాదవ్, కొండల్ రెడ్డి, నవీన్ కుమార్, కొండయ్య, వెంకటేష్ గౌడ్, జి. నారాయణరావు, సుదర్శన్, రాజన్న, రమేష్ లను వివిధ కమిటీ పదవుల్లో నియమించారు.

190 తుర్కపల్లి డివిజన్ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్ రెడ్డి అలియాస్ లడ్డు రెడ్డి ని యెన్నుకున్నారు.  

రాజేందర్ యాదవ్, సందీప్ రెడ్డి, రమేష్, రాజశేఖర్ రెడ్డి, స్వామి డిడ్లా, బాలకృష్ణ రెడ్డి, బి. సాయి, కిరణ్, నరసింగరావు, శ్రీను యాదవ్ లను పలు కమిటీ బాధ్యతల్లో నియమించారు. 

అదేవిధంగా ఏ బ్లాక్ అధ్యక్షుడిగా కేబుల్ శేఖర్ ని ప్రకటించారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ శక్తిని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. 

ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఇంచార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి, సి.ఎల్. యాదగిరి, అశోక్ రెడ్డి, సూర్య కిరణ్, సంతోష్ రెడ్డి, నరేష్ రెడ్డి, సుధాకర్, గౌస్ షేక్, ప్రభాకర్, బాల్ రెడ్డి, ప్రసాద్, రమేష్, ఇషాక్ ఖాన్, సంపత్ యాదవ్, దేవేందర్, బబ్లు, దేవా, సురేందర్, రాము, వెంకటేష్ తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్
కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని...
By Ratna Sekhar 2026-02-12 08:38:50 0 334
Andhra Pradesh
యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.
  యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌  ...
By Pagadala Venkateswar 2026-06-21 07:44:45 0 61
SURAKSHA
Sudhansh Pant: Steering Rajasthan with Vision and Integrity
Introduction (The Hook) "Good governance is measured not by policies on paper, but by the...
By Fathima Safa 2026-07-21 05:46:35 0 26
Telangana
జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని 40 పడకలుగా అభివృద్ధి చేయాలి మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆత్రం సుగుణక్క వినతి
🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్  న్యూస్ ప్రతినిధి జగదీష్   జైనూర్ మండలం కొమురం...
By Chunarkar Jagadeesh 2026-06-12 17:40:53 0 217
Telangana
జిఎస్టి తగ్గించడంలో ప్రజలపై పన్ను ప్రభావం తగ్గింది : మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన...
By Sidhu Maroju 2025-09-22 11:13:53 0 292
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com