జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని 40 పడకలుగా అభివృద్ధి చేయాలి మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆత్రం సుగుణక్క వినతి

0
214

🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్  న్యూస్ ప్రతినిధి జగదీష్  

జైనూర్ మండలం కొమురం భీం  ఆసిఫాబాద్ జిల్లా: జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గ వెంటనే 40 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న సిర్పూర్ (యూ), లింగాపూర్, తిర్యాణి, కెరమెరి, నార్నూర్ మండలాల ఆదివాసీ ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా సేవలు అందిస్తోందని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఇక్కడ పడకలు, వైద్యులు, నర్సులు, అవసరమైన వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం కూడా స్థానిక పేద ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, దీనివల్ల ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో, ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసి, పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని, ఆధునిక వైద్య పరికరాలను మరియు మెరుగైన సౌకర్యాలను కల్పించాల్సిందిగా కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారని, ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సుగుణక్క తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.
మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్...
By Pagadala Venkateswar 2026-03-08 04:48:23 0 137
Telangana
మల్లంపేట లో నియమాలకు విరుద్ధంగా నిర్మాణం చెసినా వాణిజ్య భవనం నిర్మాణం సీల్డ్ చెసిన జిహెచ్ఎంసి
దిండిగల్, మల్లంపేట ఇ మద్య నే మునిసిపాలిటీ నండి ప్రభుత్వం G H M C లో విలీనం చేసిన విషయం...
By Ponnala Srinivasrao 2026-03-04 03:55:38 0 470
Telangana
50 ఏళ్ళ తర్వాత – పత్రికా స్వేచ్ఛను రక్షిస్తున్నామా? లేక మరొక విధంగా అణచివేస్తున్నామా?
జూన్ 25, 1975 – భారత ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల రోజుగా గుర్తింపు పొందిన రోజు.ఆ రోజు...
By Bharat Aawaz 2025-06-25 09:19:51 0 1K
Telangana
నిజామాబాద్: బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ జాద్ ను పరమార్షిన్చినా మజి ఎమ్మెల్యే
నిజామాబాద్:ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్న BRS పార్టీ మైనారిటీ నగర అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాద్...
By Sadaq Sadaq 2026-04-22 16:20:44 0 132
Andhra Pradesh
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ
*ఢిల్లీ*   తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 14:50:27 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com