"తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|

0
41

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది. 

190 తుర్కపల్లి మరియు 191 మచ్చబొల్లారం డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ నాయకుల నివాసంలో ఘనంగా నిర్వహించబడింది. 

ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సమావేశంలో భాగంగా 191 డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి ని అధికారికంగా యెన్నునుకున్నారు.

ఇక అదే విధంగా శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సర్వేష్ యాదవ్, కొండల్ రెడ్డి, నవీన్ కుమార్, కొండయ్య, వెంకటేష్ గౌడ్, జి. నారాయణరావు, సుదర్శన్, రాజన్న, రమేష్ లను వివిధ కమిటీ పదవుల్లో నియమించారు.

190 తుర్కపల్లి డివిజన్ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్ రెడ్డి అలియాస్ లడ్డు రెడ్డి ని యెన్నుకున్నారు.  

రాజేందర్ యాదవ్, సందీప్ రెడ్డి, రమేష్, రాజశేఖర్ రెడ్డి, స్వామి డిడ్లా, బాలకృష్ణ రెడ్డి, బి. సాయి, కిరణ్, నరసింగరావు, శ్రీను యాదవ్ లను పలు కమిటీ బాధ్యతల్లో నియమించారు. 

అదేవిధంగా ఏ బ్లాక్ అధ్యక్షుడిగా కేబుల్ శేఖర్ ని ప్రకటించారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ శక్తిని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. 

ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఇంచార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి, సి.ఎల్. యాదగిరి, అశోక్ రెడ్డి, సూర్య కిరణ్, సంతోష్ రెడ్డి, నరేష్ రెడ్డి, సుధాకర్, గౌస్ షేక్, ప్రభాకర్, బాల్ రెడ్డి, ప్రసాద్, రమేష్, ఇషాక్ ఖాన్, సంపత్ యాదవ్, దేవేందర్, బబ్లు, దేవా, సురేందర్, రాము, వెంకటేష్ తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
రొంపిచర్ల :లబ్ధిదారులకు సైకిళ్లను పంపిణీ చేసిన.. చల్లా బాబు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో గురువారం వెలుగు మరియు డిఆర్డిఏ శాఖ...
By Kothuru Murali 2026-02-05 12:07:56 0 122
Telangana
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లా
 వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....   భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-05-05 04:47:30 0 132
Andhra Pradesh
నెల్లూరు మున్సిపల్ కార్మికుల అమానుష అరెస్టులను నిరసనగలం విప్పిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు
*నెల్లూరు మున్సిపల్ కార్మికులపై పోలీసుల అమానుష లాఠీచార్జికి, కార్మికుల అక్రమ*  *అరెస్టు లను...
By Rajini Kumari 2025-12-19 11:46:16 0 190
Andhra Pradesh
పిల్లల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం !! కర్నూలు ఎంపి!!
కర్నూలు : రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి...
By Hari Krishna 2025-12-21 09:51:26 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com