"జింఖానా గ్రౌండ్స్‌లో భక్తి తరంగం.. యువతకు సంస్కృతి సందేశం ఇచ్చిన ఈటల రాజేందర్.|

0
214

సికింద్రాబాద్ : జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న “The Confluence – Rhythm of Bhakti” కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.

యువతకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని యువత, ముఖ్యంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న Gen-Z తరగతి అనేక రకాల చెడు అలవాట్లకు గురై భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దేశంలో శాంతి, సామరస్యం నెలకొనాలంటే యువత దేశ పురోగతిలో భాగస్వాములు కావాలని, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి మానవ సంబంధాలు మరింత పరిపుష్టి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో పెద్ద కుటుంబాల్లో పెరిగిన పిల్లలు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారని, కానీ ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

అలాంటి తల్లిదండ్రుల ఆందోళనలను దూరం చేసి యువతలో సానుకూల మార్పు తీసుకురావడానికి “The Confluence – Rhythm of Bhakti” వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో G. కిషన్ రెడ్డి , N. రాంచందర్ రావు, తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు. 

యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇక్కడ నేర్చుకునే విలువలను జీవితంలో ఆచరించాలని ఈటల రాజేందర్ కోరారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ని కోటేశ్వరరావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గత కొన్ని రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్ని కోటేశ్వరావు గారు అనారోగ్యంతో...
By Rajini Kumari 2026-01-25 11:08:53 0 193
Andhra Pradesh
యువత మాదక ద్రవ్యాలకి దూరం గా ఉండాలి !
కర్నూలు :కర్నూలు జిల్లా... మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన 5 మందికి కౌన్సిలింగ్ మరియు...
By Hari Krishna 2025-12-24 16:31:17 0 257
Telangana
శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.
సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్...
By Sidhu Maroju 2025-10-09 07:37:13 0 251
Himachal Pradesh
Hydropower Projects and Renewable Energy Growth Drive
Himachal Pradesh is accelerating its clean energy transition through the expansion of hydropower...
By Fathima Safa 2026-06-22 11:05:31 0 90
SURAKSHA
V. Rashmi, IAS: A Visionary Leader Transforming Governance
A distinguished 1996-batch Karnataka cadre IAS officer, V. Rashmi has earned nationwide respect...
By Lokeshwari Panthadi 2026-07-18 11:04:04 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com