"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|

0
54

సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 

జియాగూడకు చెందిన పల్లవి గౌడ్(19) ఛాతిలో పెరిగిన గడ్డకు ఈ నెల 19న గాంధీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు సమాచారం.

పల్లవి బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ చదువుతున్నట్లు తెలిసింది. 

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఘటనపై ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న వైద్యులు.. నివేదిక వచ్చిన తరువాతే అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మహా శివరాత్రి వేళ భక్తులకు పవన్ కళ్యాణ్ శుభవార్త.. అరుణాచలం తరహాలో అక్కడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ.!
పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
By Pagadala Venkateswar 2026-02-15 05:45:52 0 159
Telangana
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష   రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి...
By Pinnehasan Odela 2026-04-08 13:24:27 0 130
Telangana
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు.... భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...
By Gujile Ramu 2026-05-04 01:13:40 0 109
Telangana
మంచినీరు, డ్రైనేజ్ సమస్యలపై హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ మేనేజర్ కి వినతిపత్రం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం హెచ్ ఏ ఎల్, ఇతరి కాలనీలకు...
By Sidhu Maroju 2025-12-29 16:35:15 0 145
Andhra Pradesh
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సి ఐ టి యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు అంగన్వాడీ యూనియన్...
By Boya Dasthagiri 2026-03-31 23:59:08 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com