"జీరో పొల్యూషన్ వరకు పోరాటం ఆగదు” : ఎం.పి. ఈటెల.|

0
241

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాంకీ సంస్థను తీవ్రంగా ప్రశ్నిస్తూ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాంకీతో ఒప్పందం చేసుకున్న సమయంలో దుర్వాసనలు రావని, కాలుష్యం ఉండదని, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినదని, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని ప్రభుత్వం హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. 

అయితే గత 15 ఏళ్లుగా రోజుకు వేల మెట్రిక్ టన్నుల చెత్తను నిర్వహిస్తున్నప్పటికీ, ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు.

జవహర్‌నగర్ సమస్యపై నిన్న, ఈరోజు నిర్వహించిన సమావేశాల్లో పార్టీలకు అతీతంగా కమిషనర్ విజయకృష్ణకు స్పష్టమైన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 

సమస్య పరిష్కారానికి విదేశాలకు వెళ్లి టెక్నాలజీలు వెతకాల్సిన అవసరం లేదని, దేశంలోనే ఇందోర్ నగరంలో తెలుగు ఐఏఎస్ అధికారి నరహరి ఆధ్వర్యంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఆర్గానిక్ మాన్యూర్ తయారీ వంటి ఆధునిక విధానాలతో జీరో పొల్యూషన్ దిశగా విజయవంతమైన నమూనా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడ ఉన్న అత్యుత్తమ సాంకేతికత అయినా తీసుకురావాలని, కానీ జవహర్‌నగర్‌లో కాలుష్యం లేకుండా, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా, ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా పూర్తి స్థాయి పరిష్కారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ లక్ష్యం నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 16 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని, వారిలో ఎక్కువ మంది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలేనని చెప్పారు. 

ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపై ఉందన్నారు. గతంలో ఈ సమస్యపై పోరాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో, అప్పటి హామీలను కార్యరూపం దాల్చించాలని కోరారు.

జవహర్‌నగర్ ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు తాము వారి పక్షానే నిలబడతామని ఎంపీ స్పష్టం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
టీజీసీపీ్గేట్ - 26 దరఖాస్తు గడువు పొడి్గీంపు
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైశ్వధ్యాలయాలో పీజీ కోర్సు లో ప్రవేశల కోసం నిర్వహించే టీజీసీపీ్గేట్ - 26...
By Prashanth Goindla 2026-06-11 03:07:06 0 158
Andhra Pradesh
శ్రీరామనవమి: గ్రీన్ హార్ట్ సేవా సంస్థ శుభాకాంక్షలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రీన్ హార్ట్ సేవా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రజలకు...
By Pagadala Venkateswar 2026-03-27 04:10:14 0 194
Andhra Pradesh
Medamalli Balaji: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ పేరు సిఫారసు.
బాలాజీ పేరును ఆమోదించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం  కేంద్రానికి...
By Pagadala Venkateswar 2026-01-29 06:19:42 0 156
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు - కేసు డైరీలు రికార్డుల క్షుణ్ణ పరిశీలన!
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు,...
By Chennaiah Kati 2026-01-31 14:29:43 0 284
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఒడిస్సా యువకుడు అనుమానాస్పద మృతి.
నిమ్మనపల్లె మండలం పరిధిలోని బోయకొండ అటవీ ప్రాంతంలో కోళ్ల ఫారాలకు కాపలాగా పనిచేస్తున్న ఒడిస్సా...
By Pagadala Venkateswar 2026-02-16 05:04:54 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com