"డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. బయటపడిన వందల కోట్ల ఆస్తులు!”

0
236

హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలు, కార్యాలయాలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ, హైదరాబాద్‌తో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టింది. 

ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తులు, విలువైన పత్రాలు, భూములకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం.

శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన సమయంలో వంశీమోహన్ ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపూర్ ప్రాంతాల్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. 

ఆ భూములను తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బదిలీ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

అలాగే ఒక రియల్టర్ నుంచి పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో పొందిన అంశం కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. 

సోదాల్లో గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ వందల కోట్ల రూపాయలకు చేరవచ్చని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
సీ సీ కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ అభివృద్ధి బాటలో మరో కీలక ఘట్టం : రూ.19 లక్షలతో సీసీ కాలువల...
By Hari Krishna 2026-01-23 06:54:05 0 180
Andhra Pradesh
ఏటకేలకు మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
మదనపల్లెలో బాలిక హత్య కేసు నేపథ్యంలో మంగళవారం ఉదయం నుండి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
By Pagadala Venkateswar 2026-02-18 07:09:25 0 156
Telangana
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని...
By Pinnehasan Odela 2026-01-15 14:40:44 0 247
Telangana
‎ ‎ ‎‎*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*
గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది...
By Ponnala Srinivasrao 2026-03-13 04:36:30 0 277
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న డ్రోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్  మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా డోన్ పట్టణంలో సేవా...
By Hari Krishna 2026-01-23 14:21:57 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com