'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు.

0
139

 

'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు

Andhra

Chandrababu Naidu Announces Stri Shakti Theme for Mahanadu 2026

ఈ ఏడాది మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ నిర్ణయం

మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానం

మహానాడును పండుగలా జరపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

ఇంధన పొదుపులో భాగంగా వర్చువల్‌గా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించాలని ఆదేశం

తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో జరగనుంది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని తీర్మానించింది. గురువారం నాడు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగింది. ఇంధన పొదుపు చర్యలలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి చంద్రబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పాల్గొనగా, మిగిలిన పొలిట్ బ్యూరో సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో హాజరయ్యారు.

 

సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మహానాడు నిర్వహణ, అజెండాపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మహానాడులో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై చంద్రబాబు కీలక సూచనలు చేశారు. మొత్తం 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 10, తెలంగాణకు 4, అండమాన్‌కు 1 తీర్మానం ఉన్నాయి. వీటితో పాటు నాలుగు ఉమ్మడి తీర్మానాలు, చివరగా ఒక కీలక రాజకీయ తీర్మానాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

 

ఈ ఏడాది మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని నిర్ణయించినందున, కార్యక్రమం మొత్తం ఆ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు, వారి హక్కులకు టీడీపీ కట్టుబడి ఉందని, ఆ విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ మహిళలనే భాగస్వాములను చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

 

వీటితో పాటు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల వంటి అంశాలపై మహానాడులో కూలంకషంగా చర్చ జరగాలని ఆదేశించారు. 'మన దేశం-మన బాధ్యత' పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న పొదుపు చర్యలపైనా ప్రత్యేకంగా చర్చించాలని సూచించారు.

 

రాష్ట్రంలో ‘ప్రత్యర్థి పార్టీ’ పేరిట జరుగుతున్న అరాచకాలను, కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, వారిలో అవగాహన పెంచేలా మహానాడు కార్యక్రమాలు ఉండాలని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. 

 

హైబ్రిడ్ పద్ధతిలో ఈసారి మహానాడు జరుగుతున్నప్పటికీ, దాని స్ఫూర్తి మాత్రం తగ్గకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. మహానాడును ఒక పండుగలా నిర్వహించాలని, రెండు రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపైనా టీడీపీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అగ్ర నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అన్ని క్లస్టర్లలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహానాడును ప్రారంభించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్.
77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-26 11:31:05 0 212
Andhra Pradesh
జాతీయ రోలర్ స్కేటింగ్లో విశాఖ అమ్మాయి బంగారు పతకం
విజయవాడ  (17-12-2025)   *స్కేటర్ అమృతకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అభినందనలు* ...
By Rajini Kumari 2025-12-17 09:46:01 0 255
Telangana
రోడ్డుమీద ఆరబెట్టిన ధాన్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది.....
నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు భరత్ అవాజ్ న్యూస్: 12 మే ఈరోజు ఉదయం వరంగల్...
By Gujile Ramu 2026-05-12 08:11:59 0 108
Arunachal Pradesh
Education and Skill Development in Arunachal Pradesh
Education and skill development in Arunachal Pradesh have witnessed steady progress with focused...
By Fathima Safa 2026-06-30 13:36:23 0 64
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వృద్ధుడు
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు....
By Kothuru Murali 2026-01-05 13:06:24 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com