గంజాయి నీయంత్రణ మాదక ద్రవ్యల నిర్ములనకై తనిఖీలు : Si ప్రశాంత్

0
44

మంచిర్యాల : గంజాయి,మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్కోటిక్ డాగ్ స్క్వాడ్,యాంటీ నార్కోటిక్స్ వింగ్, మంచిర్యాల సీసీసీ నస్పూర్ పోలీసుల సమన్వయంతో ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలు సీసీసీ నస్పూర్ కార్నర్ ప్రాంతం,ఆటో స్టాండ్ పరిసరాలు,సమీప హోటళ్లు,పాన్ షాపులు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఆటో స్టాండ్ వద్ద ఉన్న వ్యక్తులు, ప్రయాణికుల సామాన్లు,హోటళ్ల పరిసరాలు,పాన్ షాపులు మరియు అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,వినియోగం మరియు నిల్వలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలకు గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని ఎస్సై పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అధికారులను అభినందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ.
పదేళ్ల క్రితం నాటి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు: అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Pagadala Venkateswar 2026-01-23 06:07:59 0 118
Andhra Pradesh
పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి...
By Kothuru Murali 2026-04-16 17:18:55 0 78
Andhra Pradesh
AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?
Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్...
By Siva Bhaskar 2026-01-22 04:53:16 0 430
Andhra Pradesh
రాయచోటిలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
ఈరోజు రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ వినియోగదారుల...
By Benguluri Madhubabu 2026-03-15 08:23:00 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com