ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*

0
52

ప్రెస్ రిలీజ్ 

మే 20, బుధవారం

మహబూబాబాద్ జిల్లా, 

 

 

*ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*

 

*మక్కజొన్నలు 82వేల 363.900 మెట్రిక్ టన్నులు, 16 లక్షల 47వేల 278 బస్తాల తరలింపు,*

 

*ధాన్యం 89వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు, 73 వేల మెట్రిక్ టన్నుల తరలింపు,*

 

*స్వయంగా పర్యటిస్తూ ప్రత్యేక అధికారులకు సూచనలు జారీ చేస్తూ నిరంతరం రైతులకు అందుబాటులో జిల్లా కలెక్టర్, యంత్రాంగం

 

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే విధులలో తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటాం,

 

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,

 

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఆకస్మికంగా పర్యటనల ద్వారా రికార్డు స్థాయిలో జిల్లాలో మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో పక్కా ప్రణాళిక అమలు చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొని గత వారం రోజుల్లో 13 వేల 434 మంది రైతుల (214) కేంద్రాల నుండి 97 వేల 246 మెట్రిక్ టన్నుల ధాన్యంకు గాను 89వేల టన్నుల ధాన్యాన్ని సేకరించి,73 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించడం జరిగింది.

ప్రాథమిక సహకార సొసైటీ, ఐకెపి, గిరిజన కార్పొరేషన్, మెప్మాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను పూర్తిగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పర్యవేక్షిస్తూ అధిక హమాలీలను, లారీలను, ట్రాక్టర్స్, ఏర్పాటుచేసి పరిసర ప్రాంతాలలో ఉన్న మిల్లులు గోదాములలోకి తరలించడం కోసం జిల్లా యంత్రాంగం తో పాటు పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేసిందని, ప్రతి కేంద్రంలో అన్ని మౌలిక వసతులు త్రాగునీరు, టెంట్ లు, చేర్లు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ, రవాణా చేయు సందర్భములలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ విధంగా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు,మక్కజొన్నలు జిల్లా లక్ష్యం 1 లక్ష, 37వేల 910 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు 82 వేల 363 .900 మెట్రిక్ టన్నుల మక్కజొన్నలు 16వేల 059 మంది రైతుల నుండి 16 లక్షల 47 వేల 278 మక్కల బ్యాగులను ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కొనుగోలను చేసి తరలించడం జరిగింది, రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లా లో మార్క్ఫెడ్, సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అటు సెంటర్ నిర్వాహకులు ఇటు అధికారుల తో సమన్వయపరుస్తూ కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

 

రానున్న వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మక్క జొన్న, ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి చేయుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కుందేరు ఆక్రమణలపై ఆరోపణలు… వెంచర్ల పేరుతో భూ దందా?
వేటపాలెం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని కేబి పార్క్‌ను ఆదారంగా...
By Vadlamudi NagaVenkat 2026-04-17 03:52:50 0 148
Andhra Pradesh
భారీగా తప్పిన ప్రను ప్రమాదం, గిద్దలూరు టు నంద్యాల ఘాట్ నంద్యాల్ ఘాట్ రోడ్
ఈరోజు అనగా 01/05/2026 మధ్యాహ్నం 12 గంటలకి గిద్దలూరు టు నంద్యాల గ్రానైట్న నీ వేసుకొని వెళ్తున్న...
By Thokala Sivaji 2026-05-01 14:23:55 0 119
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా రాజ్యసభలో  బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి...
By Gitta Raju 2026-04-03 01:35:04 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com