సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
184

సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, కార్మికులు కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని, "బొగ్గు గనుల్లో అగ్గి మండిస్తాం” అని హెచ్చరించారు. సింగరేణిలో అంతా అవినీతిమయంగా మారిందన్నారు, ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి చెబితేనే అక్కడ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సిట్ (SIT) లేదా ఏసీబీ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. ఇచ్చిన ఉద్యోగాలపై ఏసీబీ విచారణ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని ఇక్కడ విచారణ చేయాల్సింది సింగరేణి అవినీతి మీదన్నారు. ఏసీబీ విచారణకు భయపడేది లేదన్నారు. "గాడిదలకు గడ్డేసి.. ఆవుకు పాలు వస్తాయా సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం తమ్ముళ్లు తమను అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల గల్లా పట్టుకుని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాటంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్ రావు, టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ చిలుముల రాకేష్, జాన్సన్ నాయక్, బోడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:01:08 0 274
Andhra Pradesh
Implementation of District-Wide Drone Patrolling for Enhanced Public Safety – Sri Sathya Sai District Police.
  PUTTAPARTHI | DECEMBER 26, 2025 The Sri Sathya Sai District Police, under the leadership...
By Venugopal Gopal 2025-12-26 17:18:48 0 3K
Andhra Pradesh
నత్తనడకగా పోలవరం కాలువ పనులు...
ఎంతో ప్రతిష్టత్మాక చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు, హైవే రోడ్డుఫై చేపట్టిన బ్రిడ్జ్ పనులు...
By BABJI DADALA 2026-02-04 05:07:54 0 465
Andhra Pradesh
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోAP NGO రాష్ట్ర అధ్యక్షులు ఏకగ్రీవ ఎన్నిక
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌, డిసెంబ‌ర్ 22,...
By Rajini Kumari 2025-12-23 07:28:50 0 183
SURAKSHA
Jharkhand’s One-Stop Centers: Empowering Women Through Safety
The establishment of One-Stop Centers (OSCs) in Jharkhand marks a transformative milestone in...
By Lokeshwari Panthadi 2026-07-04 11:20:24 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com