Saraswathi antya puskharalu

0
144

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద, ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అత్యంత వైభవంగా జరగనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.

 

దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, ఆలయ అర్చక బృందం, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రి గారికి వేదాశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీలు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, కమిషనర్ శ్రీ హనుమంతరావు గారు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో శ్రీ మహేష్ గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
24,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు లకు మరో 3రోజులు మాత్రమే.
కేంద్రబలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు 31తోముగియనుంది.తెలంగాణలో494,...
By Karapati Gopi 2025-12-28 09:34:18 0 375
Andhra Pradesh
పంట నష్టం వివాదం – దంపతులపై కర్రలతో దాడి.
గురువారం, రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర...
By Pagadala Venkateswar 2026-04-02 10:21:27 0 156
Andaman & Nikobar Islands
Tourists Advised to Follow Weather Safety Guidelines
The Andaman & Nicobar Administration has advised tourists visiting popular island...
By Navya Sree 2026-06-27 06:52:04 0 72
Andhra Pradesh
Pawan Kalyan: ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్.
ఎక్కువ ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమన్న పవన్   ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన...
By Pagadala Venkateswar 2026-02-03 06:48:30 0 145
Telangana
సింగరేణి గనుల పై ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకలు
మంచిర్యాల : శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్ ఆర్ పి 3 గని ఆవరణలో మహాత్మా జ్యోతి రావు పూలె 199 వ జయంతి...
By Avunoori Mahesh 2026-04-11 05:34:44 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com