కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం

0
80

విజయవాడ నగరపాలక సంస్థ 

08-05-2026

 

 

*కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం*

 

 

 *విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*

 

 

 

 విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో శాఖాధిపతులతో వివిధ కోర్టు కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల స్థితిగతులు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, కోర్టు ఆదేశాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

 

 

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి కోర్టు కేసును సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, కేసుల పురోగతిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కోర్టు ఆదేశాలను సమయానికి అమలు చేయడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. కోర్టు కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, శాఖల మధ్య సమన్వయంతో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా, వివిధ శాఖలకు సంబంధించిన న్యాయపరమైన అంశాల్లో అవసరమైన పత్రాలు, నివేదికలు మరియు సమాచారాన్ని సిద్ధం చేసి న్యాయవాదులకు అందజేయాలని సూచించారు. కోర్టు కేసుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

 

 

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఎ. రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యూసీడీ) ఎం. విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి.హరీష్, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: పద్మ పురస్కార విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు.
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం 13 మంది తెలుగు ప్రముఖులకు పురస్కారాలు రావడంపై చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-01-26 05:50:21 0 133
Andhra Pradesh
బేతంచర్ల పట్టణంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే : కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్ : ఈ రోజు బేతంచర్ల పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఏర్పాటు చేసిన నీటి...
By Hari Krishna 2026-01-22 09:24:31 0 148
Telangana
కొత్తబస్తీకి కల్వర్టు- 45 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు.|
      మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 190 డివిజన్ కొత్త బస్తీ...
By Sidhu Maroju 2025-12-22 12:30:36 0 168
Bihar
RJD Scores Major Win in MLC Bypoll
Bhojpur-Buxar | The political landscape in Bihar shifted today as the opposition Rashtriya Janata...
By Dunna Jessicaruth 2026-05-15 07:26:54 0 43
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఐడిబిఐ బ్యాంక్ గురువారం రూ. 3 లక్షల విలువైన...
By Pagadala Venkateswar 2026-01-15 11:07:33 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com