"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|

0
181

హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్” కార్యక్రమంలో భాగంగా చిలకలగూడ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు వెంటనే స్పందించవద్దని సూచించారు. 

అలాగే తెలియని వ్యక్తులు పంపే APK ఫైల్స్‌ను ఓపెన్ చేయరాదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు.

బ్యాంకు అధికారులు లేదా పోలీసులమని నమ్మబలికి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా నిర్ధారణ లేకుండా గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపరాదని స్పష్టం చేశారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి డబ్బులను ఫ్రీజ్ చేసి, కోర్టు ప్రక్రియ ద్వారా బాధితులకు తిరిగి అందించే అవకాశం ఉంటుందని పోలీసులు వివరించారు.

ఈ కార్యక్రమంలో చిలుకలగూడ ఏసీపీ కే. శశాంక్ రెడ్డి, ఎస్ఐ రాకేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి...
By Pindikura Mahesh 2026-05-30 03:11:39 0 133
Andhra Pradesh
హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్.
ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే...
By Pagadala Venkateswar 2026-06-18 04:58:29 0 51
Andhra Pradesh
చిత్తూరు: 10 వేలు పెట్టి ఎరువు కొంటే నిలువునా ముంచేశారు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మంగళవారం రైతులు కల్తీ ఎరువుల అమ్మకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం...
By Kothuru Murali 2026-05-26 11:38:26 0 81
Telangana
నిజామాబాద్:డ్రాంకన్ డ్రైవ్ లో 22 మందికి జారిమాన
జిల్లా కేంద్రంలో మద్యం తాగిన 22 మందిని పట్టుకుని రాజకీయాలు వారిణి కోర్ట్ లో హజారు పరిచారు. విచారన...
By Sadaq Sadaq 2026-03-11 16:22:00 0 203
Telangana
శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్‌లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ...
By Sidhu Maroju 2026-03-14 18:24:45 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com