బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద వరి కుప్ప దగ్దం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం..

0
396

బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద
వరి కుప్ప దగ్దం...  గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం...  సమాచారం అందుకున్న బాధితులు, స్థానికులు కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం... 

అగ్నిమాపక శాఖ తీరుతో వరి కుప్ప మొత్తం దగ్దం...

నీళ్లు లేని నీటి ట్యాంకర్...
నిలకడ లేని సిబ్బంది... 
అతుకుల బొంతగా పైపు...
ప్రభుత్వం ఇంతే ఇస్తుంది అంటూ బుకాయిస్తూ  వ్యాఖ్యలు... 

కేవలం 10 శాతం కాలిపోయి, కొద్దిపాటి నిప్పుతో ఉన్న కుప్పను అగ్ని మాపక అధికారులు నిర్లక్ష్యం చేసి , సరైన అంచనా లేకుండా  జేసిబి తెప్పించి కుప్పని కదిలించమని చెప్పి, తీరా కదిలించాక నీళ్ళు లేవని వెళ్ళిపోయి మొత్తం దగ్దం అయ్యాక చోద్యం చూస్తూ ఉన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు...

ఈ ఘటన నేపథ్యంలో అగ్ని మాపక శాఖ పనితీరు పై సామాన్యులు సంధిస్తున్న  సూటి ప్రశ్నలు... 

నీళ్లు ఉన్నాయో లేవో చేసుకోకుండానే కుప్పని కదిలించమని ఎలా చెబుతారు? 

100 మీ.పైపు మొత్తం బొక్కలు పడిపోయి నిరుపయోగంగా మారిపోయినా, ఆ పైపుతోనే మంటలు ఆర్పే ప్రయత్నం ఎలా చేస్తారు? 

నీళ్లు లేకుండా మంటలు ఆర్పే పని మీద అసలు బండి బయటకు ఎలా పంపుతారు?? 

అదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇలాగే చేస్తుందని నిర్లక్ష్యంగా సమాధానం... 

ఈ మొత్తం ఘటన పట్ల తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు... 

ఈ ఘటన పై స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు స్పందించాలని కోరుతూ... 
 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ , హోం మంత్రి అనిత తదితర ప్రముఖుల దృష్టికి తీసుకెళ్ళడానికి సమాయత్తం అవుతున్న బాధితులు... ఇమ్మడిశెట్టి నరసింహారావు,  తండ్రి ప్రసాదరావు


#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం...
By Gadiyapudi Narendra 2026-02-27 04:21:21 0 199
Business & Finance
Monsoon to Impact Goa's Tourism and Hospitality Sector
Increasing monsoon activity across the Konkan-Goa region is expected to influence tourism,...
By Navya Sree 2026-06-29 06:05:08 0 54
Andhra Pradesh
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ...
By Chennaiah Kati 2026-01-18 07:08:21 0 236
Andhra Pradesh
కార్యకర్తల సమావేశం లు సీఎం
తాడిపత్రి నియోజకవర్గం లో యాడికి మండలం లో పెండేకల్లు గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశాల లో సీఎం...
By Gitta Raju 2026-04-07 01:42:37 0 305
Telangana
గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ...
By Avunoori Mahesh 2026-06-13 11:12:42 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com