తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎవరి సభ చూసినా టార్గెట్ బిఆర్ఎస్

1
157

ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం కావాలి…

‎కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.

‎ఎవరి మాట విన్నా… ఎవరి సభ చూసినా… ఎవరి విమర్శ విన్నా…

‎ఒక్క పేరే ఎక్కువగా వినిపిస్తోంది — బిఆర్ఎస్.

‎‎బీజేపీ టార్గెట్… బిఆర్ఎస్

‎కాంగ్రెస్ టార్గెట్… బిఆర్ఎస్

‎చిన్న పార్టీలు… పెద్ద పార్టీలు…

‎కొత్తగా వచ్చిన నాయకులు…

‎యూట్యూబ్ రాజకీయ విశ్లేషకులు…

‎అందరి చర్చలో కూడా బిఆర్ఎస్‌నే కేంద్రబిందువు.

‎ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ ఒక సాధారణ పార్టీ కాదు…

‎ఒక ఉద్యమ చరిత్ర.

‎ఒక భావోద్వేగం.

‎ఒక ఆత్మగౌరవ ప్రతీక.

‎తెలంగాణ కోసం వేల మంది పోరాడిన సమయంలో

‎అవమానాలు, అరెస్టులు, విమర్శలు ఎదుర్కొంటూ

‎ఒక మనిషి మాత్రం వెనక్కి తగ్గలేదు.

‎ఆ మనిషే కేసీఆర్ గారు.

‎తెలంగాణ సాధ్యం కాదు అన్నారు…

‎అసెంబ్లీలో నవ్వారు…పార్లమెంట్‌లో అడ్డుకున్నారు…

‎అయినా తన మాట మార్చకుండా, తన లక్ష్యం వదలకుండా

‎ఒక్కడే సింహంలా పోరాడిన నాయకుడు కేసీఆర్ గారు.

‎అందుకే ఈరోజు కూడా రాజకీయాల్లో ఎవరికైనా ఎదగాలి అంటే ముందుగా బిఆర్ఎస్‌ను విమర్శిస్తారు.

‎ఎందుకంటే బలమైన చెట్టుకే ఎక్కువ రాళ్లు పడతాయి.

‎గుంట నక్కలు అన్నీ గుంపుగా రావచ్చు…

‎కానీ సింహం మాత్రం సింగిల్‌గానే వస్తుంది.

‎అది గర్జిస్తే అడవి మొత్తం వినిపిస్తుంది.

‎అదే విధంగా ఎన్ని కుట్రలు జరిగినా…

‎ఎన్ని విమర్శలు వచ్చినా… ఎన్ని పార్టీలు ఒక్కటైనా…

‎తెలంగాణ ప్రజల గుండెల్లో ఉద్యమ జ్ఞాపకాలతో నిలిచిన పేరు మాత్రం కేసీఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ.

‎ఎందుకంటే కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పుడతాయి…

‎కానీ కొన్ని ఉద్యమాల నుంచి పుడతాయి.

‎బిఆర్ఎస్ అలాంటి ఉద్యమ శక్తి.

Search
Categories
Read More
Telangana
ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి - పాల్గొన్న ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ...
By Sidhu Maroju 2025-12-01 07:13:55 0 217
Andhra Pradesh
పేద విద్యార్థులకు అండగా ‘తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ - డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోందని ఆ...
By Vadlamudi NagaVenkat 2026-03-29 09:38:00 0 441
Andhra Pradesh
శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-15 08:13:03 0 207
Andhra Pradesh
చీమనపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి కొత్తూరు మురళి
పుంగునూరు మండలం చీమనపల్లి గ్రామ సమీపంలో గురువారం రోడ్డుపై వెళ్తున్న సుమారు 55-60 ఏళ్ల...
By Kothuru Murali 2026-06-25 17:36:32 0 100
Andhra Pradesh
పుస్తకమే ప్రపంచాన్ని మార్చింది : రాఘవరెడ్డి
శుక్రవారం నాడు మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర...
By Pagadala Venkateswar 2026-02-28 06:33:37 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com