గొర్రెను కాపాడబోయి మృత్యువు బడిలోకి....!

0
50

బావిలో పడి బాలుడు మృతి.. రంగాపురంలో ఘటన....

భారత్ అవాజ్ న్యూస్: 15 మే నేడు సాయంత్రం

ఖానాపురం మండలంలో గొర్రె పిల్లని కాపాడబోయి ఓ బాలుడు ప్రాణాలు...కోల్పోయిన ఘటన మండలంలోని రంగాపురం గ్రామంలో జరిగింది. పులిగిల్ల మల్లేష్ - మానస కొడుకు పులిగిల్ల రాఘవ (11) 5 వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంట్లో గొర్రె పిల్లలను మేపడా నికి పొలాల వైపు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ గొర్రె పిల్ల మేత మేస్తూ బావి దగ్గరకు వెళ్లింది. గొర్రె పిల్ల బావిలో పడుతుందని బాలుడు గమనించి కాపాడబోయి బావిలో పడ్డాడు. గమనించిన స్థానికులు బావిలో వెతకగా బాలుడు ఆచూకీ చిక్కలేదు. సాయంత్రం 4 గంటల వరకు బావిలో వెతికి నీటిని తోడగా మృతదేహం లభ్యమైంది. ముక్కుపచ్చలారని బాలుడు మృతి రంగాపురం గ్రామంలో విషాదాన్ని నింపింది. బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పాత జ్ఞాపకాల పల్లకిలో - సేవామందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాత జ్ఞాపకాల పల్లకిలో.. సేవామందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పరిగి మండలంలోని AM లింగన్న...
By Venugopal Gopal 2026-01-12 01:36:14 0 3K
Andhra Pradesh
విజయవాడ పామర్రు లో కారు ప్రమాదం
Avja కృష్ణ జిల్లా   *పామర్రు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా...*  ...
By Rajini Kumari 2026-01-26 07:47:21 0 145
Telangana
జాతీయ ఓటరు దినోత్సవ... నా భారత్ నా ఓటు అనే నినాదం... కలెక్టర్ రాహుల్ రాజ్.
 మెదక్ జిల్లా కేంద్రంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవంలో “నా భారత్ - నా ఓటు” అనే...
By Gangaram Rangagowni 2026-01-23 09:40:58 0 340
Andhra Pradesh
భార్యపై భర్త పైశాచిక దాడి – ఇటుకలతో విచక్షణారహితంగా దాడి.
మదనపల్లె కుమారపురంలో గురువారం రాత్రి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉమాదేవి (23)పై భర్త పవన్...
By Pagadala Venkateswar 2026-03-06 02:58:03 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com