గొర్రెను కాపాడబోయి మృత్యువు బడిలోకి....!

0
51

బావిలో పడి బాలుడు మృతి.. రంగాపురంలో ఘటన....

భారత్ అవాజ్ న్యూస్: 15 మే నేడు సాయంత్రం

ఖానాపురం మండలంలో గొర్రె పిల్లని కాపాడబోయి ఓ బాలుడు ప్రాణాలు...కోల్పోయిన ఘటన మండలంలోని రంగాపురం గ్రామంలో జరిగింది. పులిగిల్ల మల్లేష్ - మానస కొడుకు పులిగిల్ల రాఘవ (11) 5 వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంట్లో గొర్రె పిల్లలను మేపడా నికి పొలాల వైపు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ గొర్రె పిల్ల మేత మేస్తూ బావి దగ్గరకు వెళ్లింది. గొర్రె పిల్ల బావిలో పడుతుందని బాలుడు గమనించి కాపాడబోయి బావిలో పడ్డాడు. గమనించిన స్థానికులు బావిలో వెతకగా బాలుడు ఆచూకీ చిక్కలేదు. సాయంత్రం 4 గంటల వరకు బావిలో వెతికి నీటిని తోడగా మృతదేహం లభ్యమైంది. ముక్కుపచ్చలారని బాలుడు మృతి రంగాపురం గ్రామంలో విషాదాన్ని నింపింది. బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: మార్కెట్ యార్డ్‌కు కారెంట్ కాట్
వ్యావసాయా మార్కెట్ యార్డ్‌కు విద్యోత్ సరాఫరాలాను నిలిపివేషారు. 6నెలాలుగా సుమరు రూ. 16 లక్షల...
By Sadaq Sadaq 2026-05-03 10:43:35 0 99
Telangana
నిజామాబాద్ : మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కెంధం ప్రారంభం
జిల్లాలో నీ గిరిరాజ్ కలశలాలో అవారనలో మెప్మా అధ్వర్యంలో  వారిధన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...
By Sadaq Sadaq 2026-04-21 09:10:15 0 92
Andhra Pradesh
మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరల పెరుగుదల.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-04-10 06:29:52 0 91
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న _ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు.
గుంటూరు,చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ నందు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహన్...
By John Baji 2026-01-22 11:13:40 0 180
Rajasthan
बदली बिना बरखा: राजस्थान सूखे की चिंता बढ़ी”
राजस्थान में इन दिनों #मौसम बदली से घेरायो है, पर बारिश नी होय रही। जयपुर सहित कई जिलां में...
By Pooja Patil 2025-09-12 04:41:26 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com