ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు.

0
82

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు

ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఇంజిన్‌లో చెలరేగిన మంటలు

డ్రైవర్ అప్రమత్తతతో క్షేమంగా బయటపడిన ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ఈ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్, అప్రమత్తమై బస్సును వెంటనే నిలిపివేశారు. ఆ సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉండగా, మంటలు వ్యాపించకముందే వారంతా సురక్షితంగా కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.

 

 

అయితే, ఈ ఏడాది ఏపీలో జరిగిన వరుస ప్రమాదాలు రవాణా భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గత మార్చి 26న మర్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో మంటలు చెలరేగి 13 మంది సజీవదహనమయ్యారు. అలాగే, ఇవాళే (మే 14న) తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ప్రైవేట్ బస్సును టిప్పర్ ఢీకొట్టగా ఒకరు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వరుస ఘటనలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, రహదారి భద్రతా నియమాల అమలుపై పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ పాఠశాలల్లో వేకెన్సీ బోర్డులు పెట్టాలి మంత్రి నారా లోకేష్ ఆకాంక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టాలి.   అదే మంత్రి నారా లోకేష్ గారి ఆకాంక్ష....
By Rajini Kumari 2026-04-20 14:24:05 0 117
Andhra Pradesh
మదనపల్లి: పసిపాప మృతదేహం కలకలం.
మదనపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రామసముద్రం మండలం ఎలకపల్లి సమీపంలోని చెరువు వద్ద గుర్తు...
By Pagadala Venkateswar 2026-04-30 04:22:19 0 98
Telangana
గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.
సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు...
By Sidhu Maroju 2025-10-14 15:21:22 0 270
Business & Finance
Credit Score Check for Better Loan Eligibility Today
A credit score check helps you understand your financial health and borrowing eligibility before...
By Navya Sree 2026-07-23 05:58:15 0 20
Andhra Pradesh
పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో విశేష నిత్య పూజలు భారీగా పెరిగిన భక్తుల తాకిడి
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,19 డిసెంబర్ 2025*...
By Rajini Kumari 2025-12-19 10:44:05 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com