ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు.

0
49

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు

ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఇంజిన్‌లో చెలరేగిన మంటలు

డ్రైవర్ అప్రమత్తతతో క్షేమంగా బయటపడిన ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ఈ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్, అప్రమత్తమై బస్సును వెంటనే నిలిపివేశారు. ఆ సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉండగా, మంటలు వ్యాపించకముందే వారంతా సురక్షితంగా కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.

 

 

అయితే, ఈ ఏడాది ఏపీలో జరిగిన వరుస ప్రమాదాలు రవాణా భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గత మార్చి 26న మర్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో మంటలు చెలరేగి 13 మంది సజీవదహనమయ్యారు. అలాగే, ఇవాళే (మే 14న) తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ప్రైవేట్ బస్సును టిప్పర్ ఢీకొట్టగా ఒకరు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వరుస ఘటనలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, రహదారి భద్రతా నియమాల అమలుపై పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాయచోటిలో ఘన నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి భాష సంయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష...
By Benguluri Madhubabu 2026-03-16 05:52:50 0 162
Andhra Pradesh
పేరాల లో వైభవంగా శ్రీ బద్రావతి సమేత భావనరుషి స్వామి రథోత్సవం
చీరాల: పేరాల లో వైభవంగా శ్రీ బద్రావతి సమేత భావనరుషి స్వామి రథోత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొన్న...
By Gadiyapudi Narendra 2026-01-19 14:23:05 0 150
Andhra Pradesh
గుంటూరు శ్రీ హజరత్ కాలే మస్తాన్‌ షా వలీ దర్గా గంధ మహోత్సవ 134వ ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన దర్గా ధర్మకర్త రావి రామ్మోహన.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ...
By John Baji 2026-01-06 13:03:16 0 175
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్...
By Ponnala Srinivasrao 2026-05-06 03:54:03 0 93
Andhra Pradesh
లబ్ధిదారులకు చెక్కుల అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు : కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన ...
By Hari Krishna 2026-01-07 09:13:14 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com