Chandrababu Naidu: ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.

0
194

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమం

వడ్డీ కోత ప్రతిపాదనను తిరస్కరించిన సీఎం చంద్రబాబు

తొలి విడతగా రూ.300 కోట్ల నిధుల విడుదల

ఉగాదిలోగా మిగిలిన రూ.900 కోట్లు జమ చేస్తామని హామీ

ఏపీలోని కాలేజీ విద్యార్థులకు, యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. నెల రోజులుగా నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. నిధులపై వడ్డీ కోత విధించాలన్న ప్రతిపాదనతో తలెత్తిన వివాదానికి సీఎం చంద్రబాబు జోక్యంతో తెరపడింది. ఎలాంటి కోతలు లేకుండా పూర్తి బకాయిలను విడుదల చేయాలని ఆయన ఆదేశించడంతో నిధుల విడుదల ప్రక్రియ మళ్లీ మొదలైంది.

 

వివరాల్లోకి వెళితే... 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు గత నెల 10న బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వో) జారీ చేసింది. అయితే, నిధులు విడుదల చేయడంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఓ మెలిక పెట్టారు. ప్రభుత్వం రుణం తెచ్చి ఈ బకాయిలు చెల్లిస్తున్నందున, ఆ రుణంపై పడే 7.5శాతం వడ్డీని (సుమారు రూ.90 కోట్లు) కాలేజీ యాజమాన్యాలే భరించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా కాలేజీలే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకున్నట్లు అగ్రిమెంట్‌పై సంతకాలు చేయాలని కోరారు.

 

అధికారుల ప్రతిపాదనను కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలకు తామే వడ్డీ కట్టడమేంటని, రుణం తీసుకున్నట్లు ఎలా సంతకాలు చేస్తామని ప్రశ్నించాయి. ఈ వివాదం కారణంగా నిధుల విడుదల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో పలు కాలేజీల యాజమాన్యాలు మెయిల్స్ ద్వారా నేరుగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశాయి. తమకు రావాల్సిన బకాయిలపై వడ్డీ విధించడం అన్యాయమని ఆయన దృష్టికి తీసుకెళ్లాయి.

 

ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ముఖ్య‌మంత్రి, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వడ్డీ ప్రతిపాదనను వెంటనే పక్కనపెట్టి, బకాయిలను యథాతథంగా విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్ర‌బాబు ఆదేశాలతో సాంఘిక సంక్షేమ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. తొలి విడతగా బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.300 కోట్ల నిధులను విడుదల చేసింది. మిగిలిన రూ.900 కోట్లను ఉగాది పండుగలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో కాలేజీ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకొని హర్షం వ్యక్తం చేశాయి. త్వరలోనే ఈ నిధులు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

Search
Categories
Read More
SURAKSHA
P. Satyanarayana Reddy IAS: Leading Good Governance
A Veteran Administrator Known for Transparent Governance, Efficient District Administration, and...
By Lokeshwari Panthadi 2026-07-14 12:35:15 0 132
Business & Finance
Think Collateral-Free Loans Are Too Good to Be True ?
Collateral-free loans allow eligible individuals, startups, and MSMEs to access financing without...
By Navya Sree 2026-07-09 06:35:52 0 75
SURAKSHA
Traffic Safety: AI Cameras Reduce Accidents in Goa
: Goa Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-03 08:57:59 0 33
Telangana
"జగన్నాథ రథయాత్ర" లో మర్రి దంపతుల సేవాభావం.|
"ప్రత్యేక పూజలతో పాటు ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే దంపతులు"...
By Sidhu Maroju 2026-07-16 14:54:19 0 54
Telangana
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జీవన్ రెడ్డి...
కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని భావోద్వేగంతో ప్రకటించిన సీనియర్...
By Ponnala Srinivasrao 2026-03-24 00:53:39 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com