ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు.

0
52

ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు

లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో వచ్చిన మంత్రులు

రెండు వాహనాలతో సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 'పొదుపు మంత్రం' అమలవుతున్న తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ, ఏపీ మంత్రులు తమ విలాసాలను పక్కనపెట్టి సామాన్యుల తరహాలో పొదుపు చర్యలు చేపట్టడం ఒక గొప్ప ముందడుగు.

 

 

 

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఇప్పటికే తమ భద్రత, కాన్వాయ్‌ విషయంలో పొదుపు పాటిస్తుండగా... ఇతర మంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఈ ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు మంత్రులు హాజరయ్యారు. 

 

 

 

ఈ సందర్భంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్ తదితరులు ఎస్కార్ట్ వాహనాలను పక్కనపెట్టి, కేవలం ఒక్కో వాహనంలోనే సీఎం కార్యాలయానికి చేరుకున్నారు.

 

 

గతంలో మంత్రి నారాయణ కాన్వాయ్‌లో తన సొంత వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలు ఉండేవి. ఇప్పుడు ఆ కాన్వాయ్‌లో ఏకంగా 50 శాతం తగ్గించుకుంటూ నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం రెండు వాహనాలతోనే ఆయన నేడు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
“రాయలసీమ వెనుకబాటుతనానికి రాజకీయాలే కారణమా?”
రాయలసీమ రాజకీయంగా ఎంతో శక్తివంతమైన ప్రాంతం. ఎన్నో ముఖ్యమంత్రులను ఇచ్చినా ఇప్పటికీ అక్కడ నీటి...
By Babitha Babitha 2026-05-18 07:15:55 0 45
Andhra Pradesh
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
By Pagadala Venkateswar 2026-01-26 04:11:29 0 137
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ...
By Gujile Ramu 2026-04-23 12:42:07 0 161
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు నిరాశ.
సీబీఐ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులలో...
By Pagadala Venkateswar 2026-02-11 07:56:06 0 105
Andhra Pradesh
104 వైద్య బృందం ఆగస్తిగానిపల్లిలో వైద్య పరీక్షలు, మాత్రల పంపిణీ
చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ, ఆగస్తిగానిపల్లిలో 104 ద్వార వైద్య పరీక్షలు, మరియు మాత్రలు...
By Kothuru Murali 2026-01-29 09:03:52 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com