Uber chief meets C M in their house

0
206

ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉబర్ (Uber) సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.

 

✅ ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది. ఉబర్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి వివరించారు.

 

✅ హైదరాబాద్ లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరిస్తున్నట్లు ఖోస్రోషాహి గారు తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తిని వ్యక్తీకరించారు. భవిష్యత్తులో మరింత విస్తరణ చేపడుతామని తెలిపారు. అందుకు ప్రభుత్వ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి గారిని కోరారు.

 

✅ దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఉబర్ ప్రతినిధులకు సూచించారు.

 

✅ తగిన పార్కింగ్ సౌకర్యాలు లేక మెట్రో స్టేషన్ల వంటి ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ముఖ్యమంత్రి గారి సూచనలపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని ఉబర్ ప్రతినిధి బృందం తెలిపింది.

 

✅ హైదరాబాద్‌కు సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ప్రతినిధులకు ముఖ్యమంత్రి గారు వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఈ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమ కార్యకలాపాల కోసం ముందుకు వచ్చాయన్నారు.

 

✅ శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలోనే చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యతను వివరించారు. గత డిసెంబర్‌లో ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో 100కు పైగా కంపెనీలు పాల్గొని పెట్టుబడులకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ కార్యాలయ నిర్మాణానికి దారా ఖోస్రోషాహి గారు ఆసక్తి చూపించారు.

 

✅ ఈ సమావేశంలో ఉబర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) మధు కన్నన్ గారు, ఉబర్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ గారు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ గారు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్‌ను వీడియో కాల్‌లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA...
By Pagadala Venkateswar 2026-07-24 05:25:17 0 18
Andhra Pradesh
యువత మాదక ద్రవ్యాలకి దూరం గా ఉండాలి !
కర్నూలు :కర్నూలు జిల్లా... మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన 5 మందికి కౌన్సిలింగ్ మరియు...
By Hari Krishna 2025-12-24 16:31:17 0 256
Andhra Pradesh
అయోధ్య శ్రీరాముని విగ్రహావిష్కరణ ప్రాణ ప్రతిష్టాపన నేటికి రెండేళ్లు
*ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముని (రాం ల‌ల్లా) విగ్రహ...
By Rajini Kumari 2026-01-22 12:17:19 0 201
Andhra Pradesh
ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి "ఇన్చార్జ్ గౌతమ్ కుమార్"    (భారత్...
By BOYA MADHU 2026-01-23 11:27:46 0 491
Nagaland
NEC Reviews Mission Coffee Clusters Across Nagaland
The North Eastern Council (NEC) has conducted a pre-investment assessment of coffee-growing...
By Navya Sree 2026-06-26 07:54:50 0 54
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com