పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారం - ఎన్.ఆర్. అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ వెల్లడి

0
72

చీరాల 

చీరాల, వేటపాలెం మండలాల్లోని పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం అందజేయనున్నట్లు ఎన్.ఆర్.అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్.ఆర్.అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ మరియు దోగుపర్తి వెంకట సురేష్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ (శుక్రవారం) ఉదయం 8:00 గంటలకు స్థానిక మునిసిపల్ ఓపెన్ థియేటర్లో ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఎం.ఎం. కొండయ్య హాజరై, విద్యార్థులకు పురస్కారాలను అందజేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు దోగుపర్తి వెంకట సురేష్, పోలుదాసు రామకృష్ణ చారగుళ్ళ గురుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలోని ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. చీరాల, వేటపాలెం మండలాల్లోని అన్ని పాఠశాలల నుంచి స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులు 9866137914 అనే ఫోన్ నంబర్‌కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని వారు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.
      మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు మదనపల్లె పట్టణ సమీపంలోని...
By Pagadala Venkateswar 2026-02-16 04:58:17 0 209
Telangana
"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-05-05 11:13:23 0 123
Andhra Pradesh
అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య
ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు  అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం,...
By Patan Khuddus 2026-05-01 17:23:51 0 209
Andhra Pradesh
పుంగనూరు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో గురువారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలికి...
By Kothuru Murali 2025-12-26 06:49:26 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com