తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి

0
117

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్‌పర్సన్‌తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీచేశారు.

‎కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత,శశికళా యాదవరెడ్డి, సదాలక్ష్మి, ఎన్‌ రాధాబాయి,ఉజ్మా ఆషై షకీరాను సభ్యులుగా నియమించారు.ఐదేండ్లపాటు వారు ఈ పదవు ల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

‎కాగా కాంగ్రెస్‌ అసలు నేతల కు రేవంత్‌ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించి,వలస కాంగ్రెస్‌ నేత విజయలక్ష్మికే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇస్తున్నారని అనుకున్నది నిజంగానే అయింది వలస కాంగ్రెస్‌కే మరో పదవి శీర్షికతో ఈ ఏడాది ఫిబ్రవరి 4న కథనం ప్రచురించింది.

‎పార్టీ కోసం కష్టపడిన మాజీ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద కేవలం 14 నెలలు మాత్రమే పని చేశారని,కానీ సీఎం మాత్రం.. 

‎బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేశవరావు కుమార్తె విజయలక్ష్మి కోసం సీటు రిజర్వ్‌ చేసిపెట్టారని కథనంలో వివరించింది. ఈ కథనంపై అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

‎కాగా చివరికి ఆమెకే అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Search
Categories
Read More
Telangana
మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష
 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :    మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-04 11:34:15 0 391
Andhra Pradesh
ప్రెస్ నోట్ 👏✍️ *మధురాతి మధురo.. మన మాతృ భాషా*..
ప్రెస్ నోట్ 👏✍️ *మధురాతి మధురo.. మన మాతృ భాషా*.. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...
By Chennaiah Kati 2026-02-21 17:08:10 0 238
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి టిఫిన్స్ ప్రారంభోత్సవంలో...
    వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభం* భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-06-15 09:49:55 0 156
SURAKSHA
. Community Policing and Public Awareness
​Content: Karnataka Police goes beyond just law enforcement by connecting with the public through...
By Kalaga Sailaja 2026-06-29 11:24:01 0 85
Telangana
అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు...
By Ponnala Srinivasrao 2026-03-26 05:27:06 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com