హైదరాబాద్ కా పైచాన్ !పెహల్వాన్ తెలంగాణ కేసరి విజేతలను ఘన సన్మానంచిన : మంత్రి వివేక్ వెంకటస్వామి

0
114

హైదరాబాద్, మే 12 : గతంలో హైదరాబాద్ కా పైచాన్ అంటే హైదరాబాద్ కా పెహల్వాన్ అనే పేరు ఉండేది” అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. సరైన అవకాశాలు లేకపోవడంతో ఎంతో ప్రతిభ కలిగిన కుస్తీ క్రీడాకారులు తమ ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించలేకపోయారని పేర్కొన్నారు.ఇటీవల ఎల్బీ స్టేడియంలో మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కేసరి–2026 కుస్తీ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం పెహల్వాన్లకు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని తెలిపారు. కుస్తీ క్రీడలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి అంజన్ కుమార్ యాదవ్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక మంచి పెహల్వాన్అని పేర్కొన్నారు.వ్యాయామశాలల సంస్కృతి ఒకప్పుడు హైదరాబాద్‌లో ఎంతో బలంగా ఉండేదని గుర్తు చేసుకుంటూ, తన తండ్రి కాకా వెంకటస్వామి కూడా వ్యాయామశాలకు వెళ్లేవారని మంత్రి తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని అన్నారు.పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను అభినందించిన మంత్రి, వారు మరింత శిక్షణ తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, నిర్వాహకులు, కుస్తీ అభిమానులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన గ్రామం ముఖద్వారం ప్రారంభోత్సవం పామర్రు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర
18/1/2026. పెరిసెపల్లి గ్రామం, పామర్రు మండలం.    *సమాజంలో అట్టడుగున ఉన్న పేదల...
By Rajini Kumari 2026-01-18 14:31:34 0 160
Uttar Pradesh
Tragic Overturn: Road Accident in Dhalai District
A pall of gloom descended on the Dhalai district following a devastating road accident in the...
By Dunna Jessicaruth 2026-05-18 10:42:11 0 29
Andhra Pradesh
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు మంత్రి లోకేష్
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్    టీడీపీలో...
By Rajini Kumari 2026-01-27 11:35:19 0 141
Telangana
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి...
By Sidhu Maroju 2026-03-30 16:48:43 0 175
Andhra Pradesh
మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు - టిడిపి నాయకులు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు...
By Ratna Sekhar 2026-03-11 07:04:51 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com