"దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|

0
184

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది.

మే 3, 2026న నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వెలుగులోకి రావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

కేంద్ర దర్యాప్తు సంస్థ CBIతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లోని కొన్ని కోచింగ్ సెంటర్ల ద్వారా పరీక్షకు 48 గంటల ముందే విద్యార్థులకు అందించిన “ప్రాక్టీస్ పేపర్”లోని ప్రశ్నలు అసలు NEET ప్రశ్నపత్రంతో భారీగా సరిపోలినట్లు దర్యాప్తులో గుర్తించారు. 

దాదాపు 140 ప్రశ్నలు ఒరిజినల్ పేపర్‌లో ఉండటంతో, సుమారు 600 మార్కులకు సమానమైన ప్రశ్నలు ముందుగానే కొందరికి చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారం బయటపడటంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై ఇప్పటికే రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) విచారణ ప్రారంభించింది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఫోన్లు, డిజిటల్ చాట్లు, కోచింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

లీక్ వ్యవహారం రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండొచ్చని కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

NTA విడుదల చేసిన ప్రకటనలో పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, ఇందుకు విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 

కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని తెలిపింది. అలాగే పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

మే 3న జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 

పరీక్ష రద్దు నిర్ణయంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు జాతీయ స్థాయి పోటీ పరీక్షల భద్రత, పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఐపీఎల్‌లో పంజాబ్, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరు
ఐపీఎల్-19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్...
By Kothuru Murali 2026-04-01 05:55:17 0 121
Andhra Pradesh
నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మండల కో కన్వీనర్...
By Benguluri Madhubabu 2026-04-06 12:07:30 0 233
Andhra Pradesh
బాధితులకు న్యాయం లక్ష్యం.. నేరస్థులకు శిక్షే ధ్యేయం: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్...
By Pagadala Venkateswar 2026-03-25 03:03:23 0 135
Andhra Pradesh
పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, దిగుమూర్తివారిపల్లె వద్ద సోమవారం ఒంటరి...
By Kothuru Murali 2026-01-13 09:14:06 0 143
Andhra Pradesh
డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధికారుల వెల్లడి
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ...
By Mobbu Venkatramana 2026-02-25 14:37:31 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com