ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య

0
557

నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్‌గా అమలవుతున్నాయని పేర్కొన్నారు.

అంబారుపేట గ్రామంలో గత రెండేళ్ల కాలంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.60 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. గ్రామంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రూ.4.5 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం గ్రామాభివృద్ధి, మహిళా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంబారుపేట గ్రామ శ్రీ సత్తెమ్మ తల్లి దేవస్థాన కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : కుమార్ దీపక్ ఐఏఎస్
మంచిర్యాల :ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సురక్షిత మాతృత్వం కార్యక్రమం...
By Avunoori Mahesh 2026-04-08 10:17:24 0 217
Telangana
అంగన్‌వాడీ కేంద్రాలు, త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూన్ 11: కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-06-11 14:52:42 0 212
Andhra Pradesh
కూటమి ప్రభుత్వంలో వరుసగా అమ్మవారి గుడిలో అపచారాలు
విజయవాడ 10-01-2026    ప్రచురణార్థం    * *కూటమి ప్రభుత్వంలో దుర్గగుడిలో...
By Rajini Kumari 2026-01-10 12:39:03 0 175
Andhra Pradesh
Anam Ramanarayana Reddy: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఆనం.
2014 నుంచి పక్కాగా సాగుతున్న టెండర్ల వ్యవస్థను తుంగలో తొక్కారన్న ఆనం నిబంధనలను ఐదు నెలల...
By Pagadala Venkateswar 2026-02-24 10:51:43 0 285
Telangana
మంచిర్యాల్: పర్యావరణ దినోత్సవం
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అదునపు సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి లక్షట్ పేట్ పర్యావరణ...
By Bonagiri RaviShankar 2026-06-05 17:48:48 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com