Anam Ramanarayana Reddy: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఆనం.

0
286

2014 నుంచి పక్కాగా సాగుతున్న టెండర్ల వ్యవస్థను తుంగలో తొక్కారన్న ఆనం

నిబంధనలను ఐదు నెలల వ్యవధిలోనే సడలించారని విమర్శ

భోలేబాబా, వైష్ణవి వంటి సంస్థలు లబ్ధి పొందాయన్న మంత్రి

 

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కల్తీ కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కడం వల్లే ఈ అపవిత్రత చోటుచేసుకుందని ఆయన విశ్లేషించారు. 

 

 

2014 నుంచి పక్కాగా సాగుతున్న ఈ-టెండర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం 2020లో పూర్తిగా నీరుగార్చిందని మంత్రి ఆరోపించారు. నెయ్యి సేకరణలో అత్యంత కఠినంగా ఉండాల్సిన నిబంధనలను కేవలం ఐదు నెలల వ్యవధిలోనే సడలించడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆవు పాల ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారని ఆరోపించారు.

 

 

గత ప్రభుత్వ నిర్ణయాలు భోలేబాబా, వైష్ణవి వంటి నిర్దిష్ట డెయిరీలకు భారీగా లబ్ధి చేకూర్చాయని ఆనం వివరించారు. బిడ్డర్ల సంఖ్యను పెంచుతున్నామనే సాకుతో నిబంధనలు మార్చినప్పటికీ, వాస్తవానికి బిడ్డర్లు పెరగలేదని, కేవలం అనుభవంలేని కొన్ని సంస్థలు తక్కువ ధర కోట్ చేసి కాంట్రాక్టులు దక్కించుకునేలా మార్గం సుగమం చేశారని ఆయన విమర్శించారు.

Search
Categories
Read More
Telangana
Maala Employees coordination committee
రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో ప్రజా పాలన – ప్రగతి...
By G k Nookala 2026-03-06 14:45:34 0 146
Andhra Pradesh
అమ్మచెరువుమిట్టలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్ శిబిరం.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం బొమ్మనచెరువు వైద్య...
By Pagadala Venkateswar 2026-06-20 04:23:44 0 65
SURAKSHA
After Retirement: Telangana Police Fight Social Evils
Retirement తీసుకున్న Telangana Police officers సమాజంలోని evils తో పోరాడుతున్నారు. Child marriage...
By Kalaga Sailaja 2026-07-03 11:55:22 0 67
Telangana
పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మెదక్ జిల్లా:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్...
By Sidhu Maroju 2025-09-01 13:13:24 0 433
Telangana
అల్వాల్ పోలీసుల నిఘానేత్రం - నేరాల నియంత్రణే లక్ష్యం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా...
By Sidhu Maroju 2026-01-30 17:19:18 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com