రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
191

మంచిర్యాల జిల్లా | మే 8 అకాల వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రైతులు మృతి చెందిన ప్రాంతాలను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్‌పేట్ తహసిల్దార్ దిలీప్ కుమార్, డీసీసీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డి మరియు అధికారులతో కలిసి ఘటనాస్థలాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. లక్షెట్‌పేట్ మండలం కొత్తూరు కొనుగోలు కేంద్రంలో గోడ కూలి రైతులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. రవాణా సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదని, లారీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కొత్తూరు కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని నెల్కి వెంకటాపూర్ గోదాముకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అకాల వర్షాల ప్రమాదంలో మృతి చెందిన కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని, గంపలపల్లి గ్రామానికి చెందిన తండ్రి–కొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ మరియు తహసిల్దార్ రోహిత్ దేశ్‌పాండేతో కలిసి పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.
సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ అరెస్టు నుంచి మధ్యంతర...
By Pagadala Venkateswar 2026-04-23 03:45:16 0 101
Tamilnadu
Tamil Nadu Expands Space and Defence Manufacturing Base
Tamil Nadu is strengthening its position as a key hub for India's space and defence manufacturing...
By Fathima Safa 2026-06-29 10:13:31 0 60
Business & Finance
Odisha Approves ₹42 Crore Fertiliser Support Scheme
The Odisha government has approved a ₹42 crore interest subvention scheme to strengthen...
By Navya Sree 2026-06-29 06:24:07 0 62
Andhra Pradesh
చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు....
చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్...
By Gadiyapudi Narendra 2026-02-17 16:01:03 0 291
Telangana
వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు
మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.    జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్...
By Sidhu Maroju 2025-08-04 12:42:56 0 825
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com