సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.

0
101

సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ

అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం

కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న కేసులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ ఆయన తరఫున దాఖలైన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం మిమ్మల్ని అరెస్టు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేనందున, ఈ దశలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

 

ఈ కేసుకు సంబంధించి నిన్న జస్టిస్ యాదవల్లి లక్ష్మణరావు ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే కింది కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిందని, అందువల్ల పోలీసులు తమ క్లయింట్లను అరెస్టు చేసే అవకాశం ఉందని, వారిని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

 

దీనిపై స్పందించిన న్యాయమూర్తి, తమ ముందు ప్రస్తుతానికి అలాంటి సమాచారమేమీ లేదని పేర్కొన్నారు. కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వులను మాత్రమే సస్పెండ్ చేశామని, ఆ ఉత్తర్వులను కొట్టివేయలేదని స్పష్టం చేశారు. పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.

 

సీఎం చంద్రబాబుపై మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరి, పార్టీ కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వారిని రిమాండ్‌కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను కుప్పం కోర్టు తిరస్కరించగా, దాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే.

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh Strengthens Startup and Innovation Ecosystem
Andhra Pradesh is steadily expanding its startup and innovation ecosystem through policy support,...
By Fathima Safa 2026-06-27 11:06:22 0 52
Andhra Pradesh
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు అవసరం – పర్యావరణ పరిరక్షణకు న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ మద్దతు
కాకినాడ: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఇంకా కొనసాగుతుండటం...
By Ratna Sekhar 2026-03-10 14:46:00 0 897
Telangana
𝗦𝗮𝗶𝗳𝗮𝗯𝗮𝗱 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 & 𝗖𝗖𝗦 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 𝗔𝗿𝗿𝗲𝘀𝘁 𝗧𝘄𝗼 𝗦𝗲𝗿𝘃𝗮𝗻𝘁 𝗧𝗵𝗲𝗳𝘁 𝗢𝗳𝗳𝗲𝗻𝗱𝗲𝗿𝘀 – 𝗝𝗲𝘄𝗲𝗹𝗹𝗲𝗿𝘆 𝗪𝗼𝗿𝘁𝗵 ₹𝟭.𝟱 𝗖𝗿 𝗥𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝗲𝗱
Hyderabad:  Saifabad Police, in coordination with CCS Hyderabad, arrested two offenders...
By Sidhu Maroju 2025-09-11 14:57:27 0 303
Telangana
రోడ్డుమీద ఆరబెట్టిన ధాన్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది.....
నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు భరత్ అవాజ్ న్యూస్: 12 మే ఈరోజు ఉదయం వరంగల్...
By Gujile Ramu 2026-05-12 08:11:59 0 105
Goa
Goa Accelerates Urban Development and Smart City Plans
Goa is advancing urban development and smart city initiatives to improve public infrastructure,...
By Fathima Safa 2026-06-25 12:50:35 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com