సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.

0
65

సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ

అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం

కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న కేసులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ ఆయన తరఫున దాఖలైన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం మిమ్మల్ని అరెస్టు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేనందున, ఈ దశలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

 

ఈ కేసుకు సంబంధించి నిన్న జస్టిస్ యాదవల్లి లక్ష్మణరావు ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే కింది కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిందని, అందువల్ల పోలీసులు తమ క్లయింట్లను అరెస్టు చేసే అవకాశం ఉందని, వారిని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

 

దీనిపై స్పందించిన న్యాయమూర్తి, తమ ముందు ప్రస్తుతానికి అలాంటి సమాచారమేమీ లేదని పేర్కొన్నారు. కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వులను మాత్రమే సస్పెండ్ చేశామని, ఆ ఉత్తర్వులను కొట్టివేయలేదని స్పష్టం చేశారు. పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.

 

సీఎం చంద్రబాబుపై మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరి, పార్టీ కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వారిని రిమాండ్‌కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను కుప్పం కోర్టు తిరస్కరించగా, దాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే.

Search
Categories
Read More
Telangana
యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యాలయాన్ని ఆకస్మితిగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ సుదర్శన్...
మెదక్ జిల్లా కేంద్రంలోని యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ...
By Gangaram Rangagowni 2025-12-23 09:07:49 0 209
Andhra Pradesh
ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు
రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి   టిడిపి నేత, మాజీ...
By Rajini Kumari 2026-01-11 09:42:32 0 151
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-04-03 12:52:33 0 123
Andhra Pradesh
నాలుగు స్తంభాల వద్ద ఏడు లక్షల వ్యయంతో మెట్లు డ్రైన్ల నిర్మాణం
*నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం*   *44వ డివిజన్ కార్పొరేటర్...
By Rajini Kumari 2026-03-09 17:28:07 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com