కడివెళ్ల గ్రామానికి చర్చి ఓపెనింగ్ లో బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి

0
84

ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చర్చిని ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు దేవుని కృపతో ప్రతి కుటుంబం శాంతి, సంతోషాలతో నిండాలని, సమాజంలో ఐక్యత, సౌహార్దం పెంపొందాలని ఆకాంక్షించారు. విశ్వాసం మనుషులను మంచి మార్గంలో నడిపిస్తూ సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.అలాగే, చర్చి సంఘ సభ్యులు మాట్లాడుతూ చర్చి నిర్మాణానికి ప్రారంభ దశలో ఎమ్మెల్యే గారు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్, టీడీపీ మండల అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, చర్చ్ సంఘ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కాజీపల్లి ఎల్లమ్మ తల్లి జాతర కోసం పోటాపోటీ ఫ్లెక్సీ లు పెట్టినా స్థానిక నాయకులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అత్యంత...
By Ponnala Srinivasrao 2026-03-16 05:06:02 0 209
Telangana
అల్వాల్ లో ఘనంగా స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
                  మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-08-18 16:31:05 0 583
Andhra Pradesh
నందిగామలో "జలధార జలహారతి "కార్యక్రమం
నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ లోవరాజు నందిగామ,...
By Patan Khuddus 2026-04-18 10:41:46 0 378
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
_*నందవరం మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నిర్వహించిన `రైతన్న… మీకోసం` వారోత్సవాలు...
By Boya Dasthagiri 2026-03-26 00:50:23 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com