గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|

2
302

 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. 

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత సంతాన సాఫల్య కేంద్రం (IVF Centre) ద్వారా తొలి శిశువు జన్మించింది.

అల్వాల్‌కు చెందిన ఓ మహిళ ఈ అత్యాధునిక చికిత్స ద్వారా మాతృత్వాన్ని పొంది, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

అల్వాల్‌కు చెందిన విజయ (పేరు మార్చాం) (30) అనే మహిళకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. సంతానం కోసం గతంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఐవీఎఫ్ సేవల గురించి తెలుసుకున్న ఆ దంపతులు 2024 అక్టోబర్‌లో ఇక్కడి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు.

 

వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఐవీఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీన ఎమర్జెన్సీ సిజేరియన్ ద్వారా ఆమె 2 కిలోల బరువున్న ఆడశిశువుకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో ఫిబ్రవరి 25న వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

 

ఈ అద్భుత విజయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. గాంధీ ఐవీఎఫ్ బృందంలోని డాక్టర్ శోభ, డాక్టర్ సుమిత్ర నాయర్, డాక్టర్ ఫాతిమా రాణి తదితరులను ఆయన అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. 

 

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 5 నుండి 10 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను పేదలకు ఉచితంగా అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం గాంధీ మరియు పేట్లబురుజు ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా, త్వరలోనే వరంగల్ మరియు ఆదిలాబాద్‌లకు కూడా వీటిని విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మాతృత్వం పొందలేని మహిళలకు ఇది ఒక వరమని  ఆసుపత్రి సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు 

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఉరుసు ఆహ్వానం
*విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కు ఉరుసు మహోత్సవ ఆహ్వానం*    సంప్రదాయ ప్రకారం...
By Rajini Kumari 2025-12-23 07:39:32 0 185
Telangana
ఎన్యుమరేషన్‌పై ఇంటింటి పర్యటన.|
–రాజీవ్ వీకర్ సెక్షన్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలన....
By Sidhu Maroju 2026-07-20 09:34:17 0 54
Andhra Pradesh
చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్వినీ వైష్ణవ్.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన!
Andhra Union Minister Ashwini Vaishnaw Asks CM Chandrababu Mobile Details విశాఖలో గూగుల్ క్లౌడ్...
By Pagadala Venkateswar 2026-04-29 05:28:20 0 108
Telangana
హనుమాన్ జయంతి: శాంతి శ్రీనివాస్ రెడ్డి భక్తి దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2026-04-02 07:24:44 0 210
SURAKSHA
Vadarevu Vinay Chand IAS: Transforming Governance with Vision
A distinguished Andhra Pradesh cadre IAS officer known for his visionary leadership, efficient...
By Lokeshwari Panthadi 2026-07-16 06:52:04 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com