పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.|

0
96

"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు"

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బుధవారం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. 

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ జోన్-1 డీసీపీ కనకాల రాహుల్ రెడ్డి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, మల్కాజిగిరి ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ పి. సుబ్బయ్య పర్యవేక్షణలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ శిబిరం నిర్వహించారు.

ఈ ఆరోగ్య శిబిరంలో మొత్తం 127 మంది పోలీసు సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నేత్ర పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల పరీక్షలు, ఈసీజీ, ఆర్థోపెడిక్ పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించి వైద్య నిపుణులు అవసరమైన సూచనలు అందించారు.

శిబిరం నిర్వహణలో రెటినోవా ఫౌండేషన్ నేత్ర వైద్య సేవలు, శ్రీకర ఆసుపత్రి సాధారణ ఆరోగ్య పరీక్షలు, స్కై ఫిట్ ఫిజియోథెరపీ ఆర్థోపెడిక్ సేవలు, పద్మ సాయి డెంటల్ దంత వైద్య సేవలు అందించి సహకరించాయి.

గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం. రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి కమిషనరేట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు తెలిపారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు : కోడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు : కోడుమూరు  : ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి...
By Hari Krishna 2026-01-05 23:54:57 0 215
Telangana
పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు....
By Sunka Santhosh 2026-06-21 18:17:01 0 158
Telangana
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్...
By Gandla Vaijanath 2026-04-05 07:43:08 0 350
Andhra Pradesh
లక్ష్మీనరసింహస్వామి ఆరాధన ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
కర్నూలు : నంద్యాల : డోన్ :  నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని ప్యాపిలి మండలం...
By Hari Krishna 2026-01-21 08:35:19 0 146
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం కాశీరావుపేట మలుపు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిప్రసాద్ (22)...
By Pagadala Venkateswar 2026-03-02 07:40:46 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com