కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.

0
101

నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం

 జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన పోలీసులు

 సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు

పల్నాడు జిల్లా కారంపూడిలో పట్టపగలు బంగారం వ్యాపారిపై దాడి చేసి రూ.60 లక్షల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారం, నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను పల్నాడు ఎస్పీ బి. కృష్ణారావు మీడియాకు వెల్లడించారు.

 

వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై ఇటీవల జరిగిన దోపిడీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. స్థానిక జ్యువెలరీ షాపులో పనిచేస్తున్న గోసుల శంబయ్య (27) ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అని తేల్చారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, చెడు అలవాట్లకు బానిసైన శంబయ్య.. వ్యాపారి శ్రీనివాసరావు కదలికలపై నిఘా పెట్టాడు. ప్రతి సోమవారం శ్రీనివాసరావు ఆభరణాలతో కారంపూడికి వస్తాడని తెలుసుకుని, తన స్నేహితులతో కలిసి దోపిడీకి పక్కా ప్రణాళిక రచించాడు.

 

ప్లాన్ ప్రకారం, బండారు అజిత్ (25), కె. శశికుమార్ (22), కె. సాయికిరణ్ (24), ఎ. నిఖిల్ మహేష్ (20), జి. పవన్ (30)లతో కలిసి శంబయ్య ఈ దోపిడీకి పాల్పడ్డాడు. వ్యాపారిపై దాడి చేసి, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును లాక్కొని బైక్‌లపై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గురజాల డీఎస్పీ మహేశ్వరరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

 

సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి, ఎన్ఎస్పీ కాలువ కట్ట వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 566.60 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన యమహా ఎంటీ-15, హీరో గ్లామర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని ఎస్పీ కృష్ణారావు అభినందించారు

Search
Categories
Read More
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి మదనపల్లెలో విజయోత్సవ సభ.
మదనపల్లెలో గురువారం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-06-19 04:33:53 0 69
Andhra Pradesh
గ్లకోమా (నీటి చుక్కల వ్యాధి)పై అవగాహన సదస్సు.
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం 'జాతీయ గ్లకోమా వారోత్సవాలు' నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి...
By Pagadala Venkateswar 2026-03-10 08:49:21 0 137
Telangana
The hospital of gratitude by apollo hospital
హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ లో అపోలో హాస్పిటల్స్ వారి 'హాస్పిటల్ ఆఫ్...
By G k Nookala 2026-04-27 14:40:55 0 232
Andhra Pradesh
ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:48:56 0 225
Andhra Pradesh
ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి: నిసార్ అహమద్
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరగకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని...
By Pagadala Venkateswar 2026-06-15 06:40:59 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com