కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.

0
104

నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం

 జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన పోలీసులు

 సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు

పల్నాడు జిల్లా కారంపూడిలో పట్టపగలు బంగారం వ్యాపారిపై దాడి చేసి రూ.60 లక్షల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారం, నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను పల్నాడు ఎస్పీ బి. కృష్ణారావు మీడియాకు వెల్లడించారు.

 

వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై ఇటీవల జరిగిన దోపిడీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. స్థానిక జ్యువెలరీ షాపులో పనిచేస్తున్న గోసుల శంబయ్య (27) ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అని తేల్చారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, చెడు అలవాట్లకు బానిసైన శంబయ్య.. వ్యాపారి శ్రీనివాసరావు కదలికలపై నిఘా పెట్టాడు. ప్రతి సోమవారం శ్రీనివాసరావు ఆభరణాలతో కారంపూడికి వస్తాడని తెలుసుకుని, తన స్నేహితులతో కలిసి దోపిడీకి పక్కా ప్రణాళిక రచించాడు.

 

ప్లాన్ ప్రకారం, బండారు అజిత్ (25), కె. శశికుమార్ (22), కె. సాయికిరణ్ (24), ఎ. నిఖిల్ మహేష్ (20), జి. పవన్ (30)లతో కలిసి శంబయ్య ఈ దోపిడీకి పాల్పడ్డాడు. వ్యాపారిపై దాడి చేసి, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును లాక్కొని బైక్‌లపై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గురజాల డీఎస్పీ మహేశ్వరరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

 

సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి, ఎన్ఎస్పీ కాలువ కట్ట వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 566.60 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన యమహా ఎంటీ-15, హీరో గ్లామర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని ఎస్పీ కృష్ణారావు అభినందించారు

Search
Categories
Read More
Andhra Pradesh
"ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు"
"ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు" AP: మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట...
By Chennaiah Kati 2026-02-25 13:24:44 0 216
Andhra Pradesh
ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు
*ప్రవేట్ పాఠశాలల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం*   ▪️*ఈనెలాఖరులోగా ఆన్లైన్లో చేసుకోవాలన్న...
By Rajini Kumari 2025-12-20 13:27:59 0 202
Andhra Pradesh
పుంగనూరు: మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-06-03 15:07:34 0 79
SURAKSHA
Administrative Stalwart: The Vision of D.K. Singh
Architect of Odisha’s Growth: The Legacy of D.K. Singh:  In the complex corridors of...
By Kalaga Sailaja 2026-07-18 09:02:05 0 53
Telangana
Padi parishram director meet c m
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి...
By G k Nookala 2026-04-03 12:15:02 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com