జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|

0
201

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో అంబరాన్నంటాయి. మచ్చ బొల్లారం (డివిజన్ 133) కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని  మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. 

" రెపరెపలాడిన జాతీయ పతాకం "

 అల్వాల్ లోని రాజీవ్ గాంధీ సర్కిల్, ఎంజీ నగర్, సప్తగిరి ఎంక్లేవ్, గోపాల్ నగర్ సర్కిల్, జిఎంఆర్ కాలనీ వంటి పలు ప్రాంతాల్లో నిర్వహించిన  పథకావిష్కరణ కార్యక్రమాల్లో మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాఫలాలను ప్రతి పేదవాడికి అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన రాకతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం మేలుకొంది. 

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, సిఎల్ యాదగిరి, సురేష్, ఉదయ్ కుమార్, భాస్కర్,  బలవంత్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, సూర్య కిరణ్, రాజనర్సింహారెడ్డి, కృష్ణ గౌడ్, సంజీవ, తదితరులు పాల్గొన్నారు.

" కార్యకర్తల కోలాహలం :"

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళా విభాగం, ఎన్ ఎస్ యు ఐ  (NSUI) ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై హింద్, మైనంపల్లి హనుమంతరావు నాయకత్వం వర్ధిల్లాలి, అన్న నినాదాలతో అల్వాల్ ప్రాంతం మారు మోగింది.

#sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
Chaitra Teresa John IPS: Inspiring Leadership in Uniform
Chaitra Teresa John, IPS – Courage, Compassion, and Commitment to Justice...
By Fathima Safa 2026-07-10 09:13:11 0 78
Telangana
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
By Sidhu Maroju 2025-06-14 15:56:35 0 1K
Telangana
డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం సరికాదు ‎డ్రైవర్ అశోక్...
By Ponnala Srinivasrao 2026-05-26 15:54:59 0 111
Telangana
సీయం దిష్టిబొమ్మ దహనం అడగింపు
సిట్ విచారనాకు వ్యతిరేకంగా సియం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడనికి brs నాయకులు ఆదివారము...
By Sadaq Sadaq 2026-02-01 11:23:02 0 289
Telangana
పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ...
By Sidhu Maroju 2025-11-18 09:12:14 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com