కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?

0
132

కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కవిత పార్టీకి ఆ పేరు ఎలా ఇస్తారు..? ఏ ప్రాతిపదికన పార్టీ పేర్లకు గుర్తింపును ఇస్తారని.. కేంద్ర ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే.. ఇదే విషయమై ఢిల్లీ స్థాయి న్యాయ నిపుణులతో ఆ కీలక నేత చర్చించారని తెలిసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను నేరుగా కలిస్తే అందరికీ తెలిసిపోతుందని భావించిన సదరు కీలక నేత.. ఈసీఐలో రాజకీయ పార్టీల వ్యవహారాలకు సంబంధించిన సెక్షన్‌లో పనిచేసే జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారికి ఫోన్‌ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు రాజకీయ పార్టీల పేర్ల కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ పద్ధతిలో పేర్లు ఇస్తారు? అన్న అంశాలపై ఆ అధికారి నుంచి వివరణ కోరే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. ఈసీఐ పరిధిలోని వివరాలను ఫోన్ల ద్వారా గానీ.. వ్యక్తిగతంగా గానీ.. అడిగితే సమాధానం చెప్పలేమని ఆ అధికారి వెల్లడించినట్లు తెలిసింది. ఏమైనా వివరాలు కావాలంటే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే అధికారికంగా సమాధానం ఇచ్చే అవకాశముంటుందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

‎రాజకీయంగా నష్టముంటుందనే..

‎కవిత పార్టీ పేరు ‘టీఆర్‌ఎస్‌’ అని ఉంటే, అది తమ పాత పేరు కావడం వల్ల భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరుగుతుందని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధినేత కేసీఆర్‌తోపాటు గులాబీ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీఐ అధికారి కీలక నేతకు వివరాలు చెప్పకపోవడంతో బీఆర్‌ఎస్‌ వర్గం తదుపరి ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. పార్టీలకు ఒకే తరహా సంక్షిప్త పేర్లు ఉన్నప్పుడు దాన్ని నిలవరించడంలో చట్టపరమైన ఇబ్బందులేంటి? ఎన్నికల సంఘం వద్ద ఈ పేరును అడ్డుకునే అవకాశాలను న్యాయ నిపుణుల ద్వారా తెలుసుకోవాలని బీఆర్‌ఎస్‌ అధినేత సూచించినట్లు సమాచారం. కాగా.. టీఆర్‌ఎస్‌ సంక్షిప్త నామంతో ఇప్పటికే తన పార్టీ ఉందని, ఇప్పుడదే పేరుతో కవిత కొత్త పార్టీ ఉండటం వల్ల రాజకీయంగా తనకు ఇబ్బందులుంటాయని సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-06-25 05:47:35 0 48
Andhra Pradesh
పుంగనూరు: ఎమ్మార్వో హామీతో దీక్ష విరమించిన దళిత సంఘాలు
పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని...
By Kothuru Murali 2026-03-02 12:33:11 0 127
Andhra Pradesh
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే సిపిఐ దోనేపూడి శంకర్
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే   దోనేపూడి శంకర్   భారత...
By Rajini Kumari 2025-12-28 10:30:53 0 200
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 257
Andhra Pradesh
వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రమాదానికి ఆహ్వానం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల...
By Pagadala Venkateswar 2026-04-27 06:04:27 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com