ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....

0
203

ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి

డీఆర్‌డీఓ నాగ పద్మజ...

లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత పనుల పరిశీలన...

కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ...

భారత్ అవాజ్ న్యూస్ :దుగ్గొండి: ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ నాగ పద్మజ అధికారులను ఆదేశించారు. మంగళవారం దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో చేపడుతున్న ఊర చెరువు పూడికతీత పనులను ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించారు. పనుల తీరును పరిశీలించిన అనంతరం కూలీలతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో తగినంత నీడ సౌకర్యం కల్పించాలని, కూలీలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కూలీలకు ఓఆర్‌ఎస్‌ (ORS) ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధి పనుల్లో మరింత మంది పాల్గొనేలా ప్రోత్సహించాలని, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను తప్పనిసరిగా నియమించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లెక్కల అరుంధతి, సర్పంచ్ కన్నం అలిమా చిరంజీవి, ఏపీవో శ్రీనివాస్, ఈసీ రాజు, టీఏ మౌనిక, పంచాయతీ కార్యదర్శి కొండల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ మరియు ఐకేపీ ప్రతినిధులు పాల్గొన్నారు. దుగ్గొండి రిపోర్టర్ జి రాము...

 

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ పిఠాపురం...
By Pagadala Venkateswar 2026-01-29 07:03:07 0 116
Andhra Pradesh
నా ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు: బొత్స
తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఆరోగ్యంగానే ఉన్నానని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ...
By Boiena Rajesh 2026-02-28 02:47:25 0 143
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 158
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సులు పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులు మొదటి రోజు పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు రవాణా...
By Benguluri Madhubabu 2026-03-11 07:13:38 0 159
Andhra Pradesh
ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.
  ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్  Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-20 03:46:25 0 31
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com