ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రనే తిరగరాసింది

0
91

https://x.com/i/status/2042053956826984748

 

ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాద‌యాత్ర‌. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్ర‌టి ఎండ‌లో ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేప‌ట్టిన ఆ పాద‌యాత్ర రాష్ట్ర ప్ర‌జ‌ల హృద‌యాల్లో ధైర్యం నింపింది. నేనున్నాన‌నే భ‌రోసా ఇచ్చింది. నాన్న‌కు రాష్ట్రం మొత్తం మ‌ద్ద‌తుగా నిలిచి ముఖ్య‌మంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంత‌కం చేసిన ద‌గ్గ‌రి నుంచి ఆయ‌న తీసుకు వ‌చ్చిన ఎన్నో సంస్క‌ర‌ణ‌లు, ప‌థ‌కాలు రాష్ట్ర రూపు రేఖ‌లు మార్చేశాయి. రైతును రాజుగా నిలిపాయి. అక్క‌చెల్లెమ్మ‌లు వారి సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయి. ఎంతో మంది పేద పిల్ల‌లు డాక్ట‌ర్లుగా, ఇంజినీర్లుగా, క‌లెక్ట‌ర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సంద‌ర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్ర‌యాణం కొనసాగుతుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఉర్సులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీడీపీ నేత
పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు...
By Kothuru Murali 2026-05-09 14:45:53 0 57
Telangana
పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్...
By Sidhu Maroju 2025-12-19 14:20:11 0 201
Andhra Pradesh
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా – ప్రజల మౌలిక సదుపాయాలే ప్రాధాన్యంగా!
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా – ప్రజల మౌలిక సదుపాయాలే ప్రాధాన్యంగా!  పెద్దారవీడు మండలం,...
By Chennaiah Kati 2026-01-22 10:32:14 0 180
Andhra Pradesh
మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.
మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు...
By Pagadala Venkateswar 2026-04-01 04:49:40 0 120
Telangana
నిజామాబాద్: మామిడిపల్లి జాతీయ రాహదరిపై రోడ్డు ప్రమదం
ఆర్మూర్ పట్టానమ్లోని మామిడిపల్లి 44 వ జాతీయ రాహదరిపై బైకును కారు డికోనా ఘటానాలో ఒకారు మరనిచగా...
By Sadaq Sadaq 2026-04-23 01:59:41 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com