పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డ్....

0
109

భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మండల వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన మొత్తం 280 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులై, నూరు శాతం ఫలితాలతో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ఈ ఫలితాల్లో జె. కావ్యశ్రీ 566 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. మల్లంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎంజేపీ విద్యార్థి ఎన్. లోకేష్ 560 మార్కులతో ద్వితీయ స్థానం, దుగ్గొండి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లోకేష్ 554 మార్కులతో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. మండలం సాధించిన ఈ ఘనతపై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొంటూ విజేతలందరినీ అభినందించారు.. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు....

భారత్ అవాజ్ న్యూస్: రిపోర్టర్ జి రాము దుగ్గొండి....

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అగ్నిప్రమాదంలో 200 మామిడి చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, ఎల్లంకివారిపల్లి పంచాయతీ దిగుమూర్తివారిపల్లెలో శనివారం...
By Kothuru Murali 2026-04-26 10:56:59 0 60
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By Pulse 2025-05-24 06:19:07 0 3K
Telangana
రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్
రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్   ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే గేట్ నుంచి...
By Pinnehasan Odela 2026-02-02 14:48:18 0 230
Telangana
రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టిన మహిళలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-09 17:03:18 0 750
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com