Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.

0
156

 

Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు

10-03-2026 Tue 12:45 | Andhra

Andhra Pradesh to Establish 135 EV Charging Stations Under PM e Drive

వాటిలో 600 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు

జులై నాటికే అందుబాటులోకి తీసుకురానున్న ప్రభుత్వం

 

ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.50 లక్షల ఖర్చు

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ 'పీఎం ఈ-డ్రైవ్' పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ రహదారుల వెంబడి ప్రయాణించే ఈవీ వాహనదారులకు ఇకపై ఛార్జింగ్ కష్టాలు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 444 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర బృందం.. తొలి విడతలో 135 ప్రాంతాల్లో ఈవీ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో మరియు డిస్కంల ఖాళీ స్థలాల్లో వీటిని నిర్మిస్తారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలతో పాటు భారీ వాహనాలకు కూడా ఇక్కడ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది.

 

ఏప్రిల్‌లో టెండర్లు.. ఆగస్టుకల్లా పూర్తి!

ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించి జులై లేదా ఆగస్టు నాటికే ఈ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నెడ్‌క్యాప్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కేంద్రానికి సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో 80% కేంద్రం భరిస్తుండగా, మిగిలిన 20% వాటాను డిస్కంలు సమకూరుస్తాయి. ఐదేళ్ల పాటు ఆపరేటర్లు వీటిని నిర్వహిస్తారు. దీని ద్వారా వచ్చే ఆదాయం ప్రధానంగా డిస్కంలకే చెందుతుంది.

 

రెండో దశలో నగరాలపై ఫోకస్

ఏటా రాష్ట్రంలో 6 వేల ఈవీ కార్లు, 40 వేల టూవీలర్లు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. ఈ జోరును గమనించిన అధికారులు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ‘ఛార్జింగ్ నెట్‌వర్క్’ను సిద్ధం చేస్తున్నారు. హైవేల తర్వాత, నగరాల్లో ఛార్జింగ్ సదుపాయాలను పెంచడంపై దృష్టి సారించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, ఏలూరు నగరాల్లో రెండో దశలో మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన...
By Chennaiah Kati 2026-07-03 17:00:27 0 56
Andhra Pradesh
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు
*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*   *కేంద్ర మంత్రి భూపతి రాజు...
By Rajini Kumari 2025-12-15 11:00:12 0 350
Andhra Pradesh
జి ఆర్ పి పోలీసుల ప్రతిభకు ఏబిసిడి అవార్డు
పోలీస్ కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్...
By Vadlamudi NagaVenkat 2026-03-13 16:15:19 0 778
Andhra Pradesh
సోమలలో వైద్యానికి వచ్చి వ్యక్తి మృతి
వైద్యం కోసం వచ్చి అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో జరి గింది. ఆవులపల్లె...
By Pagadala Venkateswar 2026-01-15 07:17:41 0 185
Bihar
Foundation Stone Fast-Tracked for Muzaffarpur Airport
Commercial aviation in North Bihar is set for a massive upgrade as final clearances move forward...
By Lokeshwari Panthadi 2026-06-26 12:47:38 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com