పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డ్....

0
111

భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మండల వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన మొత్తం 280 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులై, నూరు శాతం ఫలితాలతో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ఈ ఫలితాల్లో జె. కావ్యశ్రీ 566 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. మల్లంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎంజేపీ విద్యార్థి ఎన్. లోకేష్ 560 మార్కులతో ద్వితీయ స్థానం, దుగ్గొండి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లోకేష్ 554 మార్కులతో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. మండలం సాధించిన ఈ ఘనతపై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొంటూ విజేతలందరినీ అభినందించారు.. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు....

భారత్ అవాజ్ న్యూస్: రిపోర్టర్ జి రాము దుగ్గొండి....

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్బిఐ కీలక నిర్ణయం డబ్బులు కట్టయ్యేముందె సిగ్నల్
ఆర్బీఐ కీలక నిర్ణయం..డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్*   డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI...
By Rajini Kumari 2026-04-23 12:56:27 0 145
Andhra Pradesh
నిర్మల సీతారామన్ గారిని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియా సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మీ ఏరియా బ్యాంకులకు వెళ్లి వారిని సంపాదించి మాత్రమే మ్యూచువల్...
By Rajini Kumari 2025-12-26 05:51:46 0 202
Andhra Pradesh
శ్రీకాకుళం: ‘ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్ స్పెషల్...
By Manda Ramkumar 2026-03-29 00:15:03 0 244
Telangana
విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి
గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా...
By Sidhu Maroju 2025-06-13 14:53:57 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com