అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

0
357

విజయవాడ

15-12-2025

 

ప్రచురణార్ధం

 

అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సి రుహుళ్ల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

 

స్థానిక 43వ డివిజన్ ఊర్మిళా నగర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వైసిపి పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మద్దు బాలు ఆధ్వర్యంలో సోమవారం నాడు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించా. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములని అన్నారు. 51 రోజుల నిరాహారదీక్ష చేసి, తన ప్రాణాలను ఫణంగా పెట్టి మన రాష్ట్రాన్ని సాధించారన్నారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మాగాంధి చూపిన బాటలో పొట్టిశ్రీరాములు నడిచారన్నారు. అలాంటి వ్యక్తికి గౌరవం ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అగౌరవపరిచింది చంద్రబాబు అయితే.. మాజీ సీఎం జగన్ ఆ దినోత్సవాన్ని గౌరవించారన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

 

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎండి రుహుళ్ల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో పాడి ఆవు చోరీ కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ కు చెందిన సుమారు రూ. 90 వేల...
By Kothuru Murali 2026-05-14 13:17:44 0 72
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls   అమరావతి   *కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
By Rajini Kumari 2025-12-17 09:36:56 0 236
Telangana
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...
By Bharat Aawaz 2025-10-16 09:10:19 0 1K
Telangana
"సెల్‌ఫోన్ డ్రైవర్లపై ఉక్కుపాదం.. రూ.13 లక్షలకు పైగా జరిమానాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు...
By Sidhu Maroju 2026-05-19 15:25:22 0 167
Andhra Pradesh
పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష
ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు...
By Pagadala Venkateswar 2026-01-23 11:17:59 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com