దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన.

0
125

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు

ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందన్న చంద్రబాబు

టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజీ-ఆసుపత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ-ఆసుపత్రుల యజమాన్యాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. ఇటీవల తమ రెండు ఆసుపత్రులు కలిసి టెలి-రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలి-రోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధూర, గన్ని భాస్కరరావు సీఎంకు వివరించారు. 

 

నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‌లో ఉన్న రోగికి రాజమండ్రి జీఎస్‌ఎల్ ఆసుపత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ చేశానని... అలాగే జీఎస్‌ఎల్‌లో ఉన్న రోగికి నారాయణ ఆసుపత్రి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. 

 

ఈ సందర్భంగా రెండు ఆసుపత్రుల యజమాన్యాలను చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే దూరంగా ఉన్నా సరే నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని ఈ సంస్థలు నిరూపించాయని సీఎం అన్నారు. రెండు రోజుల వ్యవధిలో నాలుగు సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా సర్జరీ చేయగలిగే ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని సీఎం పేర్కొన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
అల్వాల్ సర్కిల్ ల్లో హైడ్రా దూకుడు -రూ. 10 కోట్ల విలువైన పార్కు స్థలం పరిరక్షణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ లో వెలసిన గంగ ఎవెన్యూ...
By Sidhu Maroju 2025-11-27 05:21:31 0 199
Telangana
వీధుల్లో కుక్కలు వద్దు.. వెంటనే తరలించండి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
హైదరాబాద్/ హైదరాబాద్.     దేశంలో పెరుగుతున్న ర్యాబిస్ వ్యాది పట్ల తీవ్ర ఆందోళన....
By Sidhu Maroju 2025-08-11 09:42:38 0 761
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls   అమరావతి   *కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
By Rajini Kumari 2025-12-17 09:36:56 0 239
Telangana
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష   రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి...
By Pinnehasan Odela 2026-04-08 13:24:27 0 164
Telangana
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
By Sidhu Maroju 2025-06-14 15:56:35 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com