ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
Posted 2026-04-26 12:24:34
0
140
మందమర్రి మండలం పొన్నారం గ్రామ పంచాయతీలో నల్లెల్లి వినీత్ – శ్రావంతి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ హాజరై, ఇందిరమ్మ ఇల్లు గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించి, వాస్తు పూజలో పాల్గొన్నారు.
ఎంపీ మాట్లాడుతూ, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇలాంటి పథకాల ద్వారా సామాన్య ప్రజలకు నిజమైన సంక్షేమం చేరుతోందని తెలిపారు.
వినీత్ – శ్రావంతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రావణమాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ...
Chandrababu Naidu: పొగాకు ముడి ఉత్పత్తులపై పన్ను సున్నా.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ!
అన్ బ్రాండెడ్ ముడి పొగాకుపై సున్నా శాతం సుంకం
బ్రాండెడ్ ఉత్పత్తులకు 18 శాతం ఎక్సైజ్ డ్యూటీ...
పుంగునూరు నియోజకవర్గం:ఏతూరులో పల్స్ పోలియో కార్యక్రమం
పుంగనూరు మండలం, ఏతూరు పంచాయతీలోఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు...
ఆర్టీసీ కార్మికుడు మృతి....
నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్...
"తెగిపడిన విద్యుత్ తీగలు.. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే నిలిచేవా రెండు ప్రాణాలు?|
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ పరిధిలోని టెలికం కాలనీలో శనివారం తెల్లవారుజామున...