పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
162

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీపై స్పందించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించిన పార్టీని BRS అనాలా, TRS అనాలా అన్న గందరగోళంలో ప్రజలు ఉన్నారని అన్నారు.

కవిత ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.

BRS అయినా, TRS అయినా పరిస్థితి ఒకటేనని, నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కల్వకుంట్ల తారక రామారావు అహంకారం కారణంగానే కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపి, సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.

కార్మికులకు భరోసా కల్పించడంతో సమ్మె విరమించారని, ప్రజా ప్రభుత్వం కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుందని చెప్పారు.

గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలను BRS పట్టించుకోలేదని విమర్శించారు.

కవిత కొత్త పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, అది BRS ఓట్లను చీల్చుతుందని అన్నారు. BRS మరియు KTR కు నష్టం ఉంటుందని, కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.
ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత...
By John Baji 2026-01-21 10:58:11 0 235
Telangana
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు...
By Sidhu Maroju 2025-12-07 14:40:03 0 280
Andhra Pradesh
ప్రతి రోజూ ఉచిత భోజనం
శ్రీసత్య సాయి సోషియల్ వెల్ఫేర్ ట్రస్ట్  వారు విశాఖ కేజీ హేచ్ ఆసుపత్రి ఎదుట ప్రతి రోజూ...
By Mobbu Venkatramana 2026-01-17 08:16:26 0 596
Business & Finance
Fire Safety Drive Strengthens Ahmedabad Hotels
Ahmedabad's fire department has issued notices to more than 150 hotels for failing to comply with...
By Navya Sree 2026-07-03 08:35:46 0 71
Andhra Pradesh
మదనపల్లె లో కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నం.
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన 35 ఏళ్ల భవాని అనే వివాహిత పురుగుమందు తాగి...
By Pagadala Venkateswar 2026-02-20 11:31:51 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com