మహిళల అక్రమ రవాణాను అరికట్టండి

0
139

*మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి*

*- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ*

 

విజయవాడ స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాల్‌లో శుక్రవారం మహిళల రక్షణపై ట్రాఫికింగ్‌ను అరికట్టండి- రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా (ట్రాఫికింగ్) చేయడం ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని తెలిపారు. బాధితులతో, ముఖ్యంగా ట్రామాలో ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, కేసులను ఎలా విచారించాలి, వారి నుంచి కీలక సమాచారాన్ని ఎలా సేకరించాలి వంటి అంశాలపై సమగ్రంగా ఈ కార్యక్రమంలో అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారన్నారు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతోపాటు శక్తి (Shakti) యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.

 

నిందితులకు శిక్ష పడేలా చేయడంలో (Conviction Rate) విభాగాల మధ్య సమన్వయం పెంచుకోవడం అవసరమని, ఉద్యోగాల పేరుతో, ప్రేమ పేరుతో జరిగే మోసాలు మరియు బలవంతపు కార్మికుల అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని, ఈ సమావేశం ద్వారా అధికారులకు ఉన్నతమైన దర్యాప్తు పద్ధతులు నేర్పడమే కాకుండా రాష్ట్రంలో కేసుల తీవ్రతను తగ్గించడంపై దృష్టి పెట్టామని చైర్‌పర్సన్ పేర్కొన్నారు.

 

ఆర్పీఎఫ్ ఎస్పీ షణ్ముఘం మాట్లాడుతూ... మాజీ ఐపీఎస్ అధికారి పి.ఎం. నాయర్ శిక్షకుడిగా వ్యవహరించి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో రైల్వే డివిజనల్ మేనేజర్, ఆర్‌పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP), మహిళా అభివృద్ధి శాఖ (WCD), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: సీఎస్ఐ చర్చి లో ప్రధానులు
జిల్లా లోని CSI చర్చి లో శుక్రవరం  గుడ్‌ఫారిడే సందర్బంగా  ప్రతేక ప్రార్థన లూ...
By Sadaq Sadaq 2026-04-03 18:37:51 0 362
Telangana
"మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల జోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు”
మేడ్చల్ మల్కాజ్‌గిరి : నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల...
By Sidhu Maroju 2026-05-15 14:15:23 0 90
Andhra Pradesh
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు
*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*   *కేంద్ర మంత్రి భూపతి రాజు...
By Rajini Kumari 2025-12-15 11:00:12 0 273
Andhra Pradesh
మదనపల్లి: మద్యం మత్తులో కారు ఢీ – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి పట్టణంలో మంగళవారం మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరు యువకులు స్కూటర్‌ను ఢీకొని ఓ...
By Pagadala Venkateswar 2026-02-03 12:41:28 0 134
Jammu & Kashmir
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
By BMA ADMIN 2025-05-23 10:02:15 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com